Rajinikanth: ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ను మెచ్చుకున్న రజనీకాంత్‌

రీసెంట్‌ మలయాళీ సూపర్‌హిట్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ (Manjummel Boys) చిత్ర బృందాన్ని అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) మెచ్చుకున్నారు.

Published : 30 Mar 2024 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అతి తక్కువ బడ్జెట్‌తో రూపుదిద్దుకుని రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన రీసెంట్‌ మలయాళీ సూపర్‌హిట్‌ చిత్రం ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ (Manjummel Boys). అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించారు. సినిమా తనకెంతో నచ్చడంతో చిత్ర బృందాన్ని ఇంటికి ఆహ్వానించి ప్రశంసించారు. నటీనటుల యాక్టింగ్‌, మూవీ మేకింగ్‌ స్టైల్‌ను మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

చిదంబరం ఎస్‌.పొదువల్‌ దర్శకత్వం వహించిన సర్వైవల్‌ థ్రిల్లర్ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ (Manjummel Boys). సౌబిన్‌ షాహిర్‌, గణపతి, ఖలీద్‌ రెహమాన్‌, శ్రీనాథ్‌ భాసి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2006లో కేరళలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కొచ్చికి సమీప గ్రామం మంజుమ్మెల్‌కు చెందిన కొంతమంది స్నేహితులు.. విహారయాత్ర కోసం కొడైకెనాల్‌కు వెళ్లి గుణకేవ్‌లో చిక్కుకుపోతారు. కేవ్‌లో చిక్కుకున్న వారిని మిగిలినవాళ్లు ఎలా కాపాడగలిగారు? అనే ఆసక్తికర నేపథ్యంలో ఇది సిద్ధమైంది. ఏప్రిల్‌ 6న ఇది తెలుగులో విడుదల కానుంది.

రజనీకాంత్‌ చిత్రాల విషయానికి వస్తే.. ఇటీవల ‘లాల్‌ సలామ్‌’తో అలరించిన ఆయన ప్రస్తుతం టీజే జ్ఞానవేల్‌తో సినిమా చేస్తున్నారు. త్వరలో లోకేశ్‌ కనగరాజ్‌తో సినిమా పట్టాలెక్కించనున్నారు. తలైవా 171గా ఇది ప్రచారంలో ఉంది. దీనిని ఉద్దేశించి శుక్రవారం సాయంత్రం జరిగిన ఓ ఈవెంట్‌లో లోకేశ్‌ కనగరాజ్‌ మాట్లాడారు. మునుపెన్నడూ చూడనివిధంగా రజనీకాంత్‌ని చూపించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని