Ram Charan: తల్లితో కలిసి పిఠాపురానికి రామ్‌ చరణ్‌

తన తల్లితో కలిసి రామ్‌ చరణ్‌ పిఠాపురానికి వెళ్లనున్నారు. ఎందుకంటే?

Published : 10 May 2024 21:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) శనివారం పిఠాపురం (pithapuram) వెళ్లనున్నారు. తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. తన బాబాయ్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆ నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్‌ అక్కడికి వెళ్లనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా చరణ్‌ పవన్‌కు మద్దతు తెలిపారు. తన తండ్రి చిరంజీవి (Chiranjeevi).. జనసేనానికి సపోర్ట్‌గా ఓ వీడియో విడుదల చేయగా చరణ్‌ దాన్ని పోస్ట్‌ చేస్తూ ‘మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్‌ కల్యాణ్‌ని గెలిపించండి’ అని విజ్ఞప్తి చేశారు. ఆలయంలో పూజలు అనంతరం చరణ్‌ ఎన్నికల ప్రచారం చేస్తారా? లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని