Ram Charan: రామ్చరణ్ చిత్రం ప్రారంభం
‘‘నేను.. జాన్వీ కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీమేక్లో నటించాలని చాలా మంది కోరుకున్నారు. మా కలయిక ఈ సినిమాతో నిజం కానుండడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు రామ్చరణ్. ఆయన కథానాయకుడిగా...
‘‘నేను.. జాన్వీ కలిసి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీమేక్లో నటించాలని చాలా మంది కోరుకున్నారు. మా కలయిక ఈ సినిమాతో నిజం కానుండడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు రామ్చరణ్. ఆయన కథానాయకుడిగా... బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ కథానాయిక వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి. ఇది రామ్చరణ్ 16వ చిత్రం. బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ కథానాయకుడు చిరంజీవి క్లాప్నివ్వగా... నిర్మాత బోనీ కపూర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అగ్ర దర్శకుడు శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అల్లు అరవింద్ చిత్రబృందానికి స్క్రిప్ట్ని అందజేశారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు దిల్రాజు, శిరీష్, సాహు గారపాటి, రామ్ ఆచంట, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, ఎమ్మెల్యే రవి గొట్టిపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం ప్రారంభం అనంతరం రామ్చరణ్ మాట్లాడుతూ ‘‘బుచ్చిబాబు సానాకి సినిమా అంటే పిచ్చి. ‘రంగస్థలం’ కథని సుకుమార్ నలభై నిమిషాలు చెబితే, ఆ కథని రోజూ రెండేసి గంటలు చెప్పేవాడు బుచ్చిబాబు. తన సంకల్పంవల్లే ఇదంతా సాధ్యమైంది. కచ్చితంగా అద్భుతమైన సినిమా చేస్తామనే నమ్మకం ఉంది. ఎ.ఆర్.రెహమాన్తో నా కెరీర్లో ఇంత త్వరగా సినిమా చేస్తాననుకోలేదు’’ అన్నారు.
బుచ్చిబాబు సానా మాట్లాడుతూ ‘‘రామ్చరణ్ ‘రంగస్థలం’ సినిమాకి నేను సహాయ దర్శకుడిగా పనిచేశా. నాపైన నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు. ఎ.ఆర్.రెహమాన్తో పనిచేయాలన్న నా కల నా రెండో సినిమాకే నెరవేరుతోంది. అందుకు కారణం మా గురువు సుకుమార్, కథానాయకుడు, నిర్మాతలే. మా అందరికీ మంచి సినిమా అవుతుంది’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ‘‘బుచ్చిబాబు సానా ఆలోచనలు గొప్పగా ఉంటాయి. తను నన్ను కలిసినప్పుడు ఐదు సందర్భాలు చెప్పి, ఆ బాణీల గురించి వివరిస్తూ ఓ ఫైల్ ఇచ్చాడు. తనలోని ఆసక్తి చూసి ముచ్చటేసింది. ఇప్పటికే మూడు బాణీలు సిద్ధమయ్యాయి’’ అన్నారు. జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘‘నేను ఎంతగానో అభిమానించే ప్రముఖులందరితో కలిసి ఈ వేదికని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. బుచ్చిబాబు కథని చెప్పిన విధానం చూసి సినిమా చేయాలనే నిర్ణయానికొచ్చా’’ అన్నారు. ‘‘హైదరాబాద్ నాకు రెండో ఇల్లులాంటిది. తెలుగులో సినిమాలు చేశా. మరిన్ని చేయాలనుకుంటున్నా. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమానీ హిందీలో రీమేక్ చేయాలనుకున్నా’’ అన్నారు బోనీకపూర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
మహేష్బాబు, పూరి జగన్నాథ్ల కాంబినేషన్కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్మెన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. -
ఉన్నతమైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసొస్తున్నాయి
ఎదురు చూపులకి తెర పడింది. ‘కల్కి 2898 ఎ.డి’ విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు శనివారం ప్రకటించాయి. -
ప్రేమ వివాహమే చేసుకుంటా!
‘జాతిరత్నాలు’ చిత్రంతో తొలి అడుగులోనే సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడామె అల్లరి నరేశ్తో కలిసి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’తో అలరించేందుకు సిద్ధమైంది. -
కృష్ణ జయంతికి ‘హరోం హర’
‘హరోం హర’తో సినీప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. -
‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు
ప్రభుదేవా - శంకర్ కలయికలో వచ్చిన విజయవంతమైన చిత్రం ‘ప్రేమికుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని మే 1న రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు రమణ, మురళీధర్ రెడ్డి ప్రకటించారు. -
ఆ లాజిక్తోనే ప్రసన్న వదనం తీశాడు
‘‘నేను తీసిన ‘100%లవ్’ మొదలుకొని నా ప్రతి సినిమాకీ పనిచేశాడు అర్జున్. తను హాలీవుడ్లో ఉండి ఉంటే మరో స్థాయిలో సినిమాలు తీసేవాడు. -
ఈసారి శివాలెత్తిపోద్ది
‘‘నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. దీని గురించి నేనొక్కటే చెప్తాను. ఈసారి శివాలెత్తిపోద్ది’’ అన్నారు విష్వక్ సేన్. ఆయన హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. -
మూడు జంటల కథ.. ఖేల్ ఖేల్ మే
వినోదాన్ని పంచే ఏ సినిమా కోసమైనా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ జాబితాలోకే చేరే ‘ఖేల్ ఖేల్ మే’ కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు వినిపించింది చిత్రబృందం. -
అవి నా జీవితంలో చీకటి రోజులు!
‘‘నా జీవితంలోనే నేను అనుభవించిన ఓ చీకటి దశ ఇద’’ని అంటోంది నాయిక ప్రియాంక చోప్రా. బాలీవుడ్లోనే కాదు.. హాలీవుడ్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. -
తండ్రీ తనయుల సంఘర్షణ
తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి... ‘నాన్నలందరూ ఇంతే, అర్థం చేసుకోర’ంటూ బాధపడే ఓ తనయుడు... -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!