Rashmika: ఫుల్‌ స్వింగ్‌లో ‘పుష్ప2’ షూట్‌.. శ్రీవల్లి క్లిక్‌మనిపించిన ఫొటో చూశారా?

‘పుష్ప-ది రూల్‌ ’షూటింగ్‌లో సుకుమార్‌ ఫొటోను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

Published : 12 Feb 2024 20:44 IST

 

హైదరాబాద్‌: సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa2 The Rule). రష్మిక కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన పాత్రలపై కీలక సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా సెట్‌లో దర్శకుడు సుకుమార్‌ ఫొటోను తీసి, ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు రష్మిక. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చిత్ర బృందం ఈ ఫొటోను షేర్‌ చేస్తూ, ‘మార్విక్‌ డైరెక్టర్‌ ఫొటోను తీసిన శ్రీవల్లి’ అంటూ పోస్ట్‌ చేసింది. అంతేకాదు, గత కొద్దిరోజులుగా ‘పుష్ప2’ వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలకు కూడా చెక్‌పెట్టింది. ఆగస్టు 15, 2024న సినిమాను విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేసింది.

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సుకుమార్‌ తెరకెక్కించిన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ‘పుష్ప: ది రైజ్‌’ కి కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రమే ‘పుష్ప: ది రూల్‌’. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌, సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌లు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరుల కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు