Pawan kalyan: పవన్‌ కల్యాణ్‌ విజయంపై రేణూ దేశాయ్‌ పోస్ట్‌..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయంపై పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌ పోస్ట్‌ పెట్టారు.

Published : 04 Jun 2024 16:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఇప్పటికే కూటమికి చెందిన పలువురు ప్రముఖులు విజయకేతనం ఎగురవేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. దీనిపై ఆయన మాజీ భార్య రేణూదేశాయ్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా’ అంటూ ఆద్య ఆనందంగా ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను నెటిజన్లతో పాటు పవన్‌ అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

మరోవైపు పవన్‌ గెలుపును జన సైనికులు కూడా ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో పవన్‌ కల్యాణ్‌ నివాసం వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వారందరికీ పవన్‌ భార్య అన్నాలెజినోవా, కుమారుడు అకీరాలు ధన్యవాదాలు తెలుపుతూ అభివాదం చేశారు. ఆ వీడియో కూడా ఎక్స్‌లో వైరల్‌గా మారింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని