Sandeep Vanga: ‘అర్జున్‌ రెడ్డి’ని అల్లు అర్జున్‌తో తీయాలనుకున్నా.. కానీ: సందీప్‌ వంగా

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను అల్లు అర్జున్‌తో తీయాలనుకున్నట్లు దర్శకుడు సందీప్‌ వంగా తెలిపారు. కానీ, బన్నీని కలిసే అవకాశం రాలేదన్నారు.

Published : 06 Jan 2024 10:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ వంగా తెరకెక్కించిన ‘అర్జున్‌ రెడ్డి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అయితే.. ఈ సినిమాను మొదట అల్లు అర్జున్‌తో (Allu Arjun) తీయాలనుకున్నట్లు దర్శకుడు చెప్పారు.

‘‘2011లో అల్లు అర్జున్‌కు ఓ కథ చెప్పాను. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ తర్వాత ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) కథను ఆయనకు వినిపించాలనుకున్నాను. కానీ, ఆయన్ని కలవలేకపోయాను. ఆ స్క్రిప్ట్‌తో చాలామంది నటులు, నిర్మాతలను కలిశాను. చివరకు నేనే నిర్మించాను. విజయ్‌ దేవరకొండ నాకు ఓ స్నేహితుడి ద్వారా పరిచయమయ్యాడు. అలా.. బన్నీని కలవడం కుదరకపోవడంతో విజయ్‌తో ఆ సినిమా తీశాను. ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. దేనికైనా సమయం రావాలి’’ అని చెప్పారు.

ప్రస్తుతం సందీప్‌ వంగా ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ హీరోగా ఇది తెరకెక్కనుంది. ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత అల్లు అర్జున్‌తో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక గతేడాది చివర్లో ఆయన తెరకెక్కించిన ‘యానిమల్‌’ మంచి వసూళ్లను సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని