RC 16: రామ్‌చరణ్‌ కొత్త చిత్రం.. ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ అగ్ర నటుడు..?

రామ్‌చరణ్ (Ram Charan) కొత్త చిత్రంలో ప్రతి నాయకుడిగా బాలీవుడ్‌ అగ్ర నటుడు కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 21 Mar 2024 14:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కింది. బుధవారం పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు సంజయ్‌దత్‌ ప్రతినాయకుడిగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. కథ, తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆయన ఓకే అన్నారని కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, ‘కేజీయఫ్‌ 2’, ‘లియో’లో సంజయ్‌ విలన్‌గా కనిపించారు. ఆయా చిత్రాలతో ఆయన తెలుగువారికీ చేరువయ్యారు. ప్రస్తుతం రామ్‌ నటిస్తోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. స్పోర్ట్స్‌ డ్రామాగా... గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఇది సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్‌ కనిపించనున్నారు. శివరాజ్‌కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ మొదలుకానుంది. రామ్‌చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ పనుల్లో బిజీగా ఉండగా, ‘దేవర’ కోసం జాన్వీ వర్క్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని