Dunki: కౌంట్డౌన్ మొదలు
షారుక్ ఖాన్.. ఈ ఏడాది వరస విజయాలతో హిట్ కొట్టిన కథానాయకుడీయన. ఇప్పుడు మరోసారి బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించడానికి ‘డంకీ’ చిత్రంతో సిద్ధమవుతున్నారు. ఆయన, తాప్సి జంటగా నటించిన చిత్రమిది. రాజ్కుమార్ హిరాణీ తెరకెక్కించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
షారుక్ ఖాన్.. ఈ ఏడాది వరస విజయాలతో హిట్ కొట్టిన కథానాయకుడీయన. ఇప్పుడు మరోసారి బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించడానికి ‘డంకీ’ చిత్రంతో సిద్ధమవుతున్నారు. ఆయన, తాప్సి జంటగా నటించిన చిత్రమిది. రాజ్కుమార్ హిరాణీ తెరకెక్కించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నెల 21న రానున్న ఈ సినిమా కౌంట్డౌన్ పోస్టర్ను ఇన్స్టా వేదికగా పంచుకున్నారు షారుక్. ‘హార్డి, మను సూటు బూటు వేసుకొని సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఎంతో దూరంలో లేరు. ఇంకో ఏడు రోజుల్లో మేము మిమ్మల్ని కలవబోతున్నాము. కౌంట్డౌన్ ప్రారంభమయ్యింది’ అని వ్యాఖ్యల్ని జోడించారు. ఇంగ్లాండ్కి వెళ్లాలనుకునే ఐదుగురి స్నేహితుల కథను ఈ సినిమాలో చూపించనున్నారు.
డబ్బుతో మనిషి సంబంధం
యడ్లపల్లి మహేశ్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కరెన్సీ నగర్’. వెన్నెల కుమార్ పోతేపల్లి తెరకెక్కించారు. ముక్కాముల అప్పారావు, కోడూరు గోపాల కృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘డబ్బు చుట్టూ తిరిగే కథతో రూపొందిన చిత్రమిది. మనిషికి డబ్బుకు ఉన్న సంబంధాన్ని దర్శకుడు దీంట్లో ఆసక్తికరంగా చూపించారు. ఆ అంశం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, పవన్, ఛాయాగ్రహణం: సతీశ్ రాజబోయిన.
మట్కా.. ప్రారంభం
వరుణ్ తేజ్ కథానాయకుడిగా కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ గురువారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. 1958 - 1982 మధ్య కాలంలో జరిగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. దీని కోసమే అప్పటి వాతావరణాన్ని తలపించేలా ఓ భారీ సెట్ను సిద్ధం చేశారు. అందులోనే ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోంది. ‘‘యావత్ దేశాన్ని కదిలించిన యథార్థ సంఘటన ఆధారంగా అల్లుకున్న కథతో రూపొందుతోన్న చిత్రమిది. దీంట్లో వరుణ్ నాలుగు భిన్నమైన గెటప్లలో కనువిందు చేయనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో నవీన్ చంద్ర, కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తుండగా.. ఎ.కిషోర్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
‘సఖి’ ప్రేమాయణం
లోకేశ్ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘సఖి’. జానీ భాషా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పార్థురెడ్డి నిర్మాత. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట కథ ఇది. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటన కథలో ఎలాంటి మలుపులకి కారణమైందనేది ఆసక్తికరం. అనుభూతిని పంచే ఓ మంచి ప్రేమకథగా ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’న్నారు. సందీప పసుపులేటి, సుధాకర్ రెడ్డి, జ్యోతి స్వరూప్, జితిన్ ఆదిత్య తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సతీశ్ కుమార్ కారే, సంగీతం: సన్నీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జులై నుంచి ప్రేమలో..
ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. -
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?