Sharwanand: రామ్‌ చరణ్‌తో మల్టీస్టారర్‌.. శర్వానంద్‌ ఏమన్నారంటే?

‘భజే వాయు వేగం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు శర్వానంద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రామ్‌ చరణ్‌తో మల్టీస్టారర్‌పై స్పందించారు.

Published : 29 May 2024 22:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ చరణ్‌ (Ram Charan)తో మల్టీస్టారర్‌పై నటుడు శర్వానంద్‌ (Sharwanand) స్పందించారు. ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ప్రశ్న ఎదురవగా చరణ్‌తో కలిసి నటించేందుకు సిద్ధమని తెలిపారు. అదే ప్రశ్న వేడుకకు హాజరైన దర్శక, నిర్మాతలనూ అడగాలని హోస్ట్‌కు చెప్పారు. కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా నూతన దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రమే ‘భజే వాయు వేగం’. ఐశ్వర్య మేనన్‌ హీరోయిన్‌. యూవీ కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ఈవెంట్‌కు శర్వానంద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ తదితరులు అతిథులుగా పాల్గొని, చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

వేడుకనుద్దేశించి శర్వానంద్‌ మాట్లాడుతూ.. ‘‘నేనిక్కడికి ‘యూవీ’ కుటుంబ సభ్యుడిగా వచ్చా తప్ప అతిథిగా కాదు. ఈ సినిమా టీమ్‌లో కొందరితో నేను పనిచేశా. ఈ చిత్రానికి మెయిన్‌ హీరో.. డైరెక్టర్‌ ప్రశాంత్‌. నా ‘రన్‌ రాజా రన్‌’ సినిమాకి అతడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాడు. మంచి దర్శకుడు అవుతాడని ఆ సమయంలోనే అనుకున్నా. మాస్‌ కథలు అతడికి చాలా ఇష్టం. కార్తికేయ నమ్మకంతో ఈ సినిమా చేశాడు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ ఉంది. మాస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా ఏ జానర్‌ చిత్రమైనా ఆయన చేయగలరు. ఆల్‌రౌండర్‌ అయిన ఆయన త్వరలోనే సూపర్‌స్టార్‌ అవుతారు’’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు