Siddhu jonnalagadda: టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు.
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎస్.నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ.
‘డీజే టిల్లు’తో పోల్చితే ఈ ‘టిల్లు స్క్వేర్’ విషయంలో బాగా ఒత్తిడిని ఎదుర్కొన్నట్లున్నారు?
‘‘డీజే టిల్లు’ సమయంలో ప్రేక్షకుల్లో దానిపై పెద్దగా అంచనాల్లేవు. అలాగే హీరో పాత్ర ఎలా ఉంటుందనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కాకపోతే ఇప్పుడా పాత్ర ఏంటి? అదేలా వ్యవహరిస్తుంది? అన్నది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడదే పాత్రతో మరోసారి మ్యాజిక్ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజమే. అయితే మేము ఆ ఒత్తిడిని జయించి మరో మంచి సినిమాని అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాం. కచ్చితంగా మా ప్రయత్నం అందర్నీ మెప్పిస్తుంది’’.
ఇది టిల్లు పాత్రకు కొనసాగింపుగా ఉంటుందా? లేక కథకు కొనసాగింపుగా ఉంటుందా?
‘‘రెండింటికీ కొనసాగింపుగా ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటే కథ కొనసాగింపు కొంత వరకు ఉంటుంది. అయితే అది పాత కథను అక్కడక్కడా గుర్తు చేస్తూనే ఆద్యంతం ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. టిల్లు పాత్ర కూడా ఈ సీక్వెల్లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్గా ఉంటుంది. ఎందుకంటే తను ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటనేది నేను చెప్పను కానీ, థియేటర్లలో చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. బోలెడన్ని సర్ప్రైజ్లు, షాక్లు ఉంటాయి. సినిమా అంతా ప్రేక్షకులు పడి పడి నవ్వుకుంటూనే ఉంటారు. నిజానికి సినిమాలో టిల్లు ఎక్కడా నవ్వడు. వాడి బాధ వాడు పడుతుంటాడు. కానీ, తన బాధ కూడా అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుంటుంది’’.
కొత్త చిత్ర విశేషాలేంటి?
‘‘ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కామెడీ యాక్షన్ చిత్రం చేస్తున్నా. అలాగే నీరజ కోనతో ‘తెలుసు కదా’ చేస్తున్నా. నందిని రెడ్డి సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి’’.
అనుపమ బాధపడింది
‘‘మనం ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు యూట్యూబ్లో దాని కింద కామెంట్స్ వస్తుంటాయి. అందులో వచ్చే నెగటివ్ కామెంట్స్ మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. మొన్న ట్రైలర్ విడుదలైనప్పుడు చాలా మంది కామెంట్స్ పెట్టారు. ‘గత ట్రైలర్ కంటే ఇది అదిరిపోయింది’’ అని కొంతమంది పెట్టారు. అందుకు సంతోషించా. ‘పక్కా అట్టర్ ఫ్లాప్’ అని ఇంకొకరన్నారు. అది చూడగానే సంతోషం మొత్తం నీరు కారిపోయింది. ఇటీవల విడుదలైన మా సినిమా పోస్టర్స్ విషయంలో అనుపమపై కొంతమంది కామెంట్స్ చేశారు. వాటి వల్ల ఆమె ఎంతో బాధపడింది. మహిళల గురించి కామెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్షన్ ఫాంటసీ సిరీస్ను ప్రకటించిన రాజ్ అండ్ డీకే.. టైటిలిదే
రాజ్ అండ్ డీకే కొత్త సిరీస్ను ప్రకటించారు. ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఇది రానుంది. -
అల్లరి నరేశ్ కొత్త సినిమా.. కీలకపాత్రలో యంగ్ హీరోయిన్
అల్లరి నరేశ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ షేర్ చేసింది. -
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. -
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు. -
విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో!
విజయ్ సేతుపతి హిట్ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ దేశంలో ‘హనుమాన్’ రిలీజ్.. ప్రశాంత్ వర్మ పోస్ట్
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. -
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు