silence2: ముగింపు రాసే అవినాష్
ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైలెన్స్ 2’.
ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైలెన్స్ 2’. అబన్ భరూచా దేవహంస తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్, క్యాండిడ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలో ఏసీపీ అవినాష్ వర్మగా మనోజ్ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ‘గడియారం చేసే చప్పుడు మనసులో ఉద్రిక్తతను పెంచుతోంది. గందరగోళంగా ఉన్న ఈ నగరంలో హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఏసీపీ అవినాష్, అతని స్పెషల్ క్రైమ్ యూనిట్ ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు సిద్ధంగా ఉన్నారు’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. నగరంలోని ఓ బార్లో కాల్పులు జరగడం, అందుకు కారణమైన క్రిమినల్ని పట్టుకునేందుకు అవినాష్ తన బృందంతో రంగంలోకి దిగడం లాంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తి కలిగిస్తోంది. ‘ఈ కథను నడిపించే దర్శకుడు ఎవరైనా సరే దీనికి ముగింపు మాత్రం మనమే రాయాలి’ అంటూ చివర్లో మనోజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ప్రాచీ దేశాయ్, సహిల్ వేద్ తదితరులు నటించిన ఈ చిత్రం ఈ నెల 16న ఓటీటీలో విడుదల కానుంది.
ప్రేమకథ మొదలైంది
దర్శకుడు త్రినాథరావు నక్కిన చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు. నక్కిన నెరేటివ్స్ పతాకంపై విక్రమ్ సహిదేవ్ లగడపాటి కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్తర్ అనిల్ కథానాయిక. తారక్ పొన్నప్ప కీలక పాత్ర పోషిస్తున్నారు. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్లో ఈ చిత్రం ప్రారంభమైంది. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు సందీప్కిషన్ క్లాప్నివ్వగా, నిర్మాత శరత్ మరార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో కథానాయకుడు సుమంత్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్మాత త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘‘ఇదొక టౌన్లో జరిగే అందమైన ప్రేమకథ. కథ అద్భుతంగా వచ్చింది. మంచి నటులు, సాంకేతిక బృందం తోడైంది. సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు వంశీకృష్ణ మళ్ల మాట్లాడుతూ ‘‘త్రినాథరావు నక్కిన ఎంతో ప్రేమించి రాసుకున్న కథని నా చేతిలో పెట్టారు. వందశాతం కష్టపడి ఆయన అనుకున్నదానికంటే మంచి సినిమాని ఇస్తా. విక్రమ్కి తగిన పాత్ర ఇది. తను ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఎస్తర్, తారక్ పొన్నప్ప పాత్రలు కూడా చాలా బాగుంటాయి. ఎవరూ ఊహించని జానర్ చిత్రం అవుతుంది. రెగ్యులర్ చిత్రీకరణ ఈ నెల నుంచే మొదలు పెడుతున్నాం’’ అన్నారు. త్రినాథరావు నక్కిన సంస్థలో భాగం కావడం ఆనందంగా ఉందని నాయకానాయికలు అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మాయ.వి, కూర్పు: ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైన్: రఘు కులకర్ణి, సంభాషణలు: నరేశ్ తుల, రాజేంద్రప్రసాద్, సంగీతం: డేవ్జాంద్.
తరాన్ని మేల్కొలిపే ఉద్యమం
కొంత విరామం తర్వాత ఓ మంచి కథతో ‘జితేందర్ రెడ్డి’ తీశానన్నారు విరించి వర్మ. బలమైన భావోద్వేగాలు, డ్రామాతో చేసిన సినిమా ఇదన్నారు. ఆయన దర్శకత్వంలో... రాకేశ్ వర్రే కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘జితేందర్రెడ్డి’. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాత. రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాశ్ ముఖ్య పాత్రలు పోషించారు. 1980 నేపథ్యంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. బుధవారం హైదరాబాద్లో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘నీ ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొపాలి...’ అంటూ మొదలైన ప్రచార చిత్రం ఆసక్తికరంగా సాగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఛాయాగ్రాహకుడు జ్ఞానశేఖర్ ఫోన్ చేసి ‘ఒక కథ ఉంది, దర్శకత్వం చేయాలి’ అని చెప్పారు. కథ వినడానికి వెళ్లినప్పుడు ఓ పుస్తకం ఇచ్చి ఇది చదవండని చెప్పారు. అది చదివాక ఇలాంటి శక్తివంతమైన పాత్రతో సినిమా చేయాల్సిందే అనిపించింది. జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కోసం ఆయన గ్రామానికి వెళ్లి ఆయన స్నేహితుల్ని, అక్కడి ప్రజల్ని కలిశాక ఎన్నో విషయాలు తెలిశాయి. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’’ అన్నారు. నటుడు రవి ప్రకాశ్తోపాటు చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది.
సిద్ధహస్త... ప్రభుదేవా
‘కథనార్- ది వైల్డ్ సోర్సెరర్’...9వ శతాబ్దానికి చెందిన ఓ క్రైస్తవ మతగురువు చుట్టూ తిరిగే కథనంతో తెరకెక్కుతున్న మలయాళ సినిమా. వాస్తవ సంఘటనల ఆధారంగా రానున్న ఈ సినిమాను రోజిన్ థామస్ రూపొందిస్తున్నారు. అనుష్క ఈ సినిమాతో మలయాళంలో అడుగుపెట్టనుంది. జయసూర్య, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించనున్నారు. బుధవారం ప్రభుదేవా పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయన ఫస్ట్లుక్ను సిద్ధహస్తుడు అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. పొడవాటి జుట్టు, వింత వేషధారణ, చిరునవ్వుతో ఉన్న ప్రభుదేవా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఈ పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్ రెండు భాగాలుగా 14 భాషల్లో విడుదల కానుంది. గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం