Ajay Devgn: పంద్రాగస్టు నుంచి దీపావళికి!

తెరపై మరోసారి బాజీరావ్‌ సింగమ్‌ పాత్రలో తనదైన యాక్షన్‌ హంగామాతో ప్రేక్షకులను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌.

Updated : 13 Apr 2024 11:54 IST

తెరపై మరోసారి బాజీరావ్‌ సింగమ్‌ పాత్రలో తనదైన యాక్షన్‌ హంగామాతో ప్రేక్షకులను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన.. అక్షయ్‌ కుమార్‌, రణ్‌వీర్‌ సింగ్‌, టైగర్‌ ష్రాఫ్‌, కరీనా కపూర్‌, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సింగమ్‌ అగైన్‌’. రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దీన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. ఇప్పుడీ సినిమా విడుదల ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రకటించిన తేదీకి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడుతోంది చిత్రబృందం. కానీ..చిత్రీకరణ అనుకున్న సమయం కంటే ఎక్కువ పడుతోంది. వీఎఫ్‌ఎక్స్‌ తదితర కారణాలతో దీన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నార’’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని