Tollywood: ఈ ఏడాది విందు భిన్న రుచులతో పసందు
చిత్రసీమ ట్రెండ్ని సృష్టించడం కంటే...అనుసరించడమే ఎక్కువ. ఓ సినిమా విజయం సాధించిందంటే... అలాంటి కథలే పదుల సంఖ్యలో సిద్ధమవుతుంటాయి. చిత్రసీమలో అందరి లక్ష్యం విజయమే కాబట్టి... విజయవంతమైన చిత్రాల్ని, ప్రయత్నాల్ని అనుసరించే ధోరణిలోనే కనిపిస్తుంటుంది.
వైవిధ్యమైన చిత్రాలెన్నో వెండి తెరపై
చిత్రసీమ ట్రెండ్ని సృష్టించడం కంటే...అనుసరించడమే ఎక్కువ. ఓ సినిమా విజయం సాధించిందంటే... అలాంటి కథలే పదుల సంఖ్యలో సిద్ధమవుతుంటాయి. చిత్రసీమలో అందరి లక్ష్యం విజయమే కాబట్టి... విజయవంతమైన చిత్రాల్ని, ప్రయత్నాల్ని అనుసరించే ధోరణిలోనే కనిపిస్తుంటుంది. ఇలాంటి పరిణామాలతోనే కథలు, పాత్రలు అప్పుడప్పుడూ ఒకే మూసలో సాగుతుంటాయి. నేటితరం సినీ రూపకర్తలు అలా మూస పద్ధతుల్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడటం లేదు. నిర్మాతల్ని, హీరోల్ని ఒప్పిస్తూ ధైర్యంగా కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రెండ్, కల్ట్ అనే మాటలు చిత్రసీమలో విరివిగా వినిపిస్తున్నాయంటే అదే కారణం. 2023లో తెరపైకొచ్చిన కథలు... వాటి రకాల్ని గమనిస్తే వినోదాల రుచులు ఎన్నెన్నో!
తెలుగు చిత్రసీమ అంటే ఒకప్పుడు మాస్ మసాలా సినిమాలే గుర్తొచ్చేవి. ఇప్పుడలా ఒక మాటలో తేల్చేయగలమా? అగ్ర కథానాయకుల సినిమాలు దాదాపు ఒకే ఫార్ములాతో రూపొందేవి. మరిప్పుడూ? కొత్త ప్రయత్నాలకి ఏమాత్రం వెనకాడటం లేదు. అందుకే ఏటా కొత్త రకమైన కథలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. విజయాలతో సంబంధం లేకుండా తాము నమ్మిన కథలతో ప్రయాణం చేస్తున్నారు కథానాయకులు, దర్శకనిర్మాతలు. ఫలితంగా ప్రేక్షకులకు భిన్న రకాల సినిమాల్ని ఆస్వాదించే వీలు కలుగుతోంది. పీరియాడిక్ కథలు, థ్రిల్లర్లు, మన మార్క్ మాస్ మసాలా, యాక్షన్ కథలు, ప్రేమకథలు, కుటుంబ కథలు, రొమాంటిక్, కామెడీ కథలు, హారర్ చిత్రాలు, నాయికా ప్రధానమైన చిత్రాలు, చరిత్ర, జీవిత కథలు... ఇలా ఎన్నెన్నో. విజయాల సంగతి పక్కనపెడితే అసలు మనం స్పృశించని కథలంటూ లేవేమో అనేలా ఈ ఏడాది చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
మన ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే చూస్తారని ఇదివరకటిలా ఇప్పుడు వాళ్లకి వాళ్లు పరిమితులు విధించుకోవడం లేదు దర్శకులు. కరోనా తర్వాత ఓటీటీ ప్రభావంతో కథలపై పెద్ద చర్చే జరిగింది. ఇదివరకటిలాగా మాస్ కథలు తీస్తే ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితి లేదనే మాటలు వినిపించాయి. కానీ ఆ కథల్నీ కొత్తగా నేటితరం అభిరుచులకి తగ్గట్టుగా చూపిస్తే చాలని ఈ ఏడాది ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు నిరూపించాయి. పక్కా మన మార్క్ మాస్ కథలతో ఆ సినిమాలు రూపొందాయి. రూ.వందల కోట్లు వసూళ్లు సాధించాయి ఆ సినిమాలు. నాని, అల్లరి నరేశ్, రామ్, వైష్ణవ్తేజ్ తదితర యువ కథానాయకులు సైతం ఈ ఏడాది మాస్ అవతారాన్ని ప్రదర్శించారు. ఆదిపురుషుడు శ్రీరాముడిగా కనిపించి నవతరానికి రామాయణాన్ని గుర్తు చేసిన ప్రభాస్, ‘సలార్’తో తన మార్క్ యాక్షన్ హంగామా సృష్టిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’గా తనదైన శైలిలో సందడి చేసి మెప్పించిన బాలకృష్ణ, ‘భగవంత్ కేసరి’తో తన కోసం ఇలాంటి సామాజికాంశాలతో కూడిన కథల్నీ సిద్ధం చేయొచ్చని చాటి చెప్పారు. ‘దసరా’తో ఊర మాస్ అనిపించిన నాని, ఆ వెంటనే కథల ఎంపికలో తన అభిరుచిని ప్రదర్శిస్తూ ‘హాయ్ నాన్న’తో భావోద్వేగాల్నీ పంచారు. ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి కానీ ‘స్కంద’తో రామ్, ‘ఆదికేశవ’తో వైష్ణవ్తేజ్ కూడా కత్తులు చేతపట్టి హంగామా చేశారు. ‘ఉగ్రం’ సినిమాతో అల్లరి నరేశ్ కొత్త కోణంలో కనిపించారు.
ఫాంటసీ... థ్రిల్
సూపర్ నేచురల్ ఫాంటసీ కథతో పవన్కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ‘బ్రో’ చేశారు. అందులో తాత్వికత ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. థ్రిల్లర్ కథల్ని స్పృశించడంలోనూ మన చిత్రసీమ ముందుంది. మిస్టిక్ థ్రిల్లర్గా రూపొందిన సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్గా ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. రవితేజ ‘రావణాసుర’తో థ్రిల్ చేసే ప్రయత్నం చేశారు కానీ, ఫలించలేదు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘డెవిల్’తో కల్యాణ్రామ్ స్పై థ్రిల్లర్ కథని స్పృశించారు. హారర్ అంశాలతో ‘మా ఊరి పొలిమేర 2’, ‘మంగళవారం’, ‘పిండం’ తదితర చిత్రాలొచ్చాయి. పురాణాల ఆధారంగా సమంత ‘శాకుంతలం’ రూపొందింది. జీవిత కథగా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కామెడీ కథలు
నవ్వించడమే లక్ష్యంగా చేసిన చిత్రాలూ కొన్ని ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ‘మ్యాడ్’ ప్రేక్షకుల్ని నవ్వించి విజయాన్ని సొంతం చేసుకుంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తూ, నటించిన ‘కీడా కోలా’ ప్రేక్షకుల్ని నవ్వించింది. రొమాంటిక్ కామెడీ కథగా తెరకెక్కిన నవీన్ పొలిశెట్టి, అనుష్కల ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఈ ఏడాది ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కామెడీ డ్రామాతో రూపొందిన ‘బెదురులంక 2012’ చిత్రానికీ ఓ మాదిరి విజయం దక్కింది. మానవ సంబంధాల్ని తెరపై ఆవిష్కరిస్తూ వేణు యెల్దండి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. దిల్రాజు ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి చేరువ కాలేకపోయింది కానీ భావోద్వేగాల్ని పంచి విమర్శకుల మెప్పు పొందింది. మానవ సంబంధాల చుట్టూ అల్లిన ‘మంత్ ఆఫ్ మధు’ కూడా ఓ వర్గం ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ చిత్రాలన్నీ ఒకెత్తైతే, ‘బేబి’ మరో ఎత్తు. నవతరం జీవన శైలికి అద్దం పడుతూ రూపొందిన ‘బేబి’ కథల విషయంలో సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుడుతూ, భారీ వసూళ్లు సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ ‘ఖుషి’ విజయవంతమైన ప్రేమకథగా నిలిచింది. ధనుష్ నటించిన ‘సార్’ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కొత్తతరం కథల హవా కొనసాగుతోంది. ‘ఉస్తాద్’, ‘విమానం’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘హంట్’, ‘7:11 పి.ఎమ్’... ఇలా ఎన్నో కొత్త ప్రయత్నాలకి తెలుగు సినిమా ఈ ఏడాది వేదికైంది. కొన్ని కథలు పాతవే కావొచ్చు, కానీ వాటిని కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితాల్ని మాత్రం పరిశ్రమలో అప్పుడున్న పరిస్థితులే ప్రభావితం చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసుని హత్తుకునేలా ‘అలనాటి రామచంద్రుడు’ ట్రైలర్
‘అలనాటి రామచంద్రుడు’ ట్రైలర్ విడుదలైంది.
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
సూపర్ హిట్ మూవీ ‘యానిమల్’ (Animal) గురించి స్పందించారు నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor). ఆ చిత్రంపై వచ్చిన విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. -
యాక్షన్ ఫాంటసీ సిరీస్ను ప్రకటించిన రాజ్ అండ్ డీకే.. టైటిలిదే
రాజ్ అండ్ డీకే కొత్త సిరీస్ను ప్రకటించారు. ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఇది రానుంది. -
అల్లరి నరేశ్ కొత్త సినిమా.. కీలకపాత్రలో యంగ్ హీరోయిన్
అల్లరి నరేశ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ షేర్ చేసింది. -
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. -
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు. -
విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో!
విజయ్ సేతుపతి హిట్ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ దేశంలో ‘హనుమాన్’ రిలీజ్.. ప్రశాంత్ వర్మ పోస్ట్
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. -
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్లో.. బిల్ గేట్స్ అల్లుడి పోటీ
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు