tollywood: కథలు కుదిరే... కలయికలు మిగిలే!
చేతి నిండా చిత్రాలున్నా మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు.. డైరీ ఖాళీ అయ్యేలోపు మరో కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేట సాగిస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే కథలు, కలయికలు పక్కా చేసుకున్నట్లు సమాచారం అందుతుండగా.. మరికొన్ని కలయికలు, చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
చేతి నిండా చిత్రాలున్నా మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు.. డైరీ ఖాళీ అయ్యేలోపు మరో కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేట సాగిస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే కథలు, కలయికలు పక్కా చేసుకున్నట్లు సమాచారం అందుతుండగా.. మరికొన్ని కలయికలు, చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వాటి కబుర్లు మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
కథానాయకుడు శర్వానంద్ నుంచి గతేడాది ఒక్క చిత్రమూ బయటకు రాలేదు. అలాగని తనేం ఖాళీగా లేరు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ప్రస్తుతం అది ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. దీని తర్వాత శర్వా దర్శకులు రామ్ అబ్బరాజు, కల్యాణ్ శంకర్లతో సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా, ఇప్పుడాయన నుంచి మరో కొత్త కబురు రానున్నట్లు తెలుస్తోంది. ‘లూజర్’ సిరీస్తో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని మెప్పించిన అభిలాష్రెడ్డితో శర్వానంద్ ఓ చిత్రం చేయనున్నారని టాక్. ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు తెలిసింది. దీన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కథానాయికగా మాళవిక నాయర్ పేరు ప్రచారంలో ఉంది. ఈటీవీ విన్ వేదికగా విడుదలైన ‘చి90×(’ వెబ్సిరీస్తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల్ని మెప్పించారు ఆదిత్య హాసన్. ఇప్పుడాయన వెండితెరపై తొలి అడుగు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. తను కథానాయకుడు నితిన్ కోసం ఓ కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ విషయంపై ఇరువురికి మధ్య పలుమార్లు చర్చలు పూర్తయ్యాయి. దీన్ని నితిన్ సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్హుడ్’ అనే చిత్రం చేస్తున్నారు. దీని చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
నాని మాఫియా... రానా లీడర్ 2
‘దసరా’, ‘హాయ్ నాన్న’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరుమీదున్నారు నాని. ఆయన ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత నానితో కలిసి పని చేసేందుకు దర్శకులు వేణు యెల్దండి, శ్రీకాంత్ ఓదెల కథలతో సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో మరో యువ దర్శకుడి పేరు వినిపిస్తోంది. ఆయనే సుజీత్. ప్రస్తుతం ఆయన పవన్ కల్యాణ్తో ‘ఓజీ’ చేస్తున్న సంగతి తెలిసిందే. ముగింపు దశలో ఉన్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పుడిదే నిర్మాణ సంస్థలో నాని - సుజీత్ కలయికలో ఓ చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కథ సిద్ధమైందని.. ఇది మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ - నాగార్జునలతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. అదే నిర్మాణ సంస్థలో శేఖర్ తన తదుపరి చిత్రాన్ని కూడా చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంట్లో రానా కథానాయకుడిగా కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది వీళ్లిద్దరి కలయికలో వచ్చి విజయవంతమైన సినిమా ‘లీడర్’కు సీక్వెల్గా ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. రానా ప్రస్తుతం రజనీకాంత్ - టి.జె.జ్ఞానవేల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘వేట్టయన్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజు’ సినిమా చేయనున్నారు.
యాక్షన్ నేపథ్యంలో
‘జిల్’ చిత్రంతో తొలి అడుగులోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్. రెండో ప్రయత్నంలో ప్రభాస్తో ‘రాధేశ్యామ్’ చేయగా.. ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆయన నుంచి మరో కొత్త కబురు వినపడలేదు. అయితే ఇప్పుడాయన తన తదుపరి సినిమాని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ‘జిల్’తో తనని దర్శకుడిగా మార్చిన హీరో గోపీచంద్తో ఆయన ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇది పూర్తిగా యాక్షన్ నేపథ్యంలో సాగే కథతో రూపొందనుందని.. విదేశాల్లో ఎక్కువ శాతం చిత్రీకరణ జరుపుకోనుందని తెలిసింది. దీన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ వేసవిలో చిత్రీకరణ మొదలు కానుందని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల