Sree Vishnu: ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది: శ్రీవిష్ణు

శ్రీవిష్ణు కొత్త సినిమా ‘ఓం భీమ్‌ బుష్‌’ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుందన్నారు.

Published : 20 Mar 2024 20:54 IST

హైదరాబాద్‌: శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌’ (Om Bheem Bush). హర్ష కొనుగంటి రూపొందించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్‌, ఆయేషా కథానాయికలు. వి.సెల్యులాయిడ్‌, సునీల్‌ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. మర్చి 22న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు మాట్లాడారు. ‘‘హాస్యం ప్రధానంగా సాగే ఈ చిత్రంలో చివరికి రివీల్‌ అయ్యే సస్పెన్స్‌ చూసి ప్రేక్షకులు థ్రిల్‌ ఫీల్‌ అవుతారు. హారర్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ ఉన్నప్పటికీ కథనం వినోదాత్మకంగా సాగుతుంది. శాస్త్రవేత్తలు కావాలనుకునే ముగ్గురి స్నేహితుల కథ ఇది. మొదటినుంచీ ఈ సినిమాకి టైటిల్‌ తెలుగులో ఉండాలనుకున్నా. దానికోసం ఎన్నో పేర్లను పరిశీలించాం. రెండింటిని షార్ట్‌లిస్ట్‌ చేశాం. రెండోది ఇంగ్లీష్‌ టైటిల్‌. ఈ ‘ఓం భీమ్‌ బుష్‌’ అన్నది బాగా నచ్చింది. ఆ పేరు గురించి తెలుసుకున్నా. తెలంగాణ ప్రజలు ఓం భీమ్‌ బస్‌ అని పలుకుతారని విన్నారు. తమిళులు అయితే జీబూంబా అంటున్నారు’’ అని శ్రీవిష్ణు వెల్లడించారు.

మరోవైపు శ్రీవిష్ణు హసిత్‌ గోలి దర్శకత్వంలో ‘శ్వాగ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకం కింద ఈ చిత్రం రూపొందుతోంది. కళ్యాణి ఫిలింస్‌తో కలిసి గీతా ఆర్ట్స్‌ నిర్మాణంలో సినిమా చేయనున్నారు. కార్తీక్‌రాజు దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని