Tollywood: వినోదాలు ఇంకా ఉన్నాయ్!
బాక్సాఫీస్కి ఈసారి విరామం లేదు. ఫిబ్రవరిలోనూ కొత్త సినిమాల జోరు కొనసాగనుంది. సీజన్ని తలపించేలా... విడుదల కోసం పోటాపోటీగా ముస్తాబవుతున్న సినిమాలు ఎక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి.
వచ్చే నెలలోనూ.. కొత్త చిత్రాల జోరు
బాక్సాఫీస్కి ఈసారి విరామం లేదు. ఫిబ్రవరిలోనూ కొత్త సినిమాల జోరు కొనసాగనుంది. సీజన్ని తలపించేలా... విడుదల కోసం పోటాపోటీగా ముస్తాబవుతున్న సినిమాలు ఎక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి.
తెలుగులో సంక్రాంతి సినిమాల ప్రదర్శనలు ముగిశాక బాక్సాఫీస్ దగ్గర ఒక రకమైన స్తబ్దత కనిపించడం రివాజు. రావాల్సిన అగ్ర తారల సినిమాలు పండగకే వచ్చేస్తుంటాయి. దాంతో మళ్లీ వేసవి కోసమే ఎదురు చూస్తుంటాయి సినీ వర్గాలైనా, అభిమాన గణమైనా! గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకట్రెండు సినిమాలు విడుదలవుతాయి, ఆ తర్వాత వచ్చే ఫిబ్రవరి మాసాన్ని చిత్రసీమ వర్గాలు అన్సీజన్గా లెక్కగడుతుంటాయి. అర కొర చిన్న చిత్రాలే వస్తాయి తప్ప... చెప్పుకోదగ్గ సినిమాలన్నీ కూడా వేసవి లక్ష్యంగానే ముస్తాబవుతూ ఉంటాయి. కానీ ఈసారి ఆ సీన్ రివర్స్ అవుతోంది. ఫిబ్రవరిలోనూ కీలకమైన పలు చిత్రాలు విడుదలకి సన్నద్ధమవుతున్నాయి. రవితేజ ‘ఈగల్’, వరుణ్తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’, గోపీచంద్ ‘భీమా’తోపాటు... తమిళం నుంచి రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన ‘లాల్ సలామ్’ కూడా వచ్చే నెలలోనే విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఇవి కాకుండా... పరిమిత వ్యయంతో రూపొందిన చిత్రాల జాబితా చూసినా పెద్దగానే కనిపిస్తుంది.
గతేడాది డిసెంబరు నుంచి బాక్సాఫీస్ దగ్గర ప్రముఖ తారల హంగామా మొదలైంది. ప్రభాస్తోపాటు, నాని, నితిన్, కల్యాణ్రామ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇక సంక్రాంతి సందర్భంగా మహేశ్బాబు, నాగార్జున, వెంకటేశ్ చిత్రాలొచ్చాయి. వీళ్లమధ్యకి ‘హను-మాన్’ వచ్చి సత్తా చాటుతున్నాడు. మరో కథానాయకుడు రవితేజ కూడా తన ‘ఈగల్’తో ఈ సంక్రాంతి సందర్భంగానే సందడి చేయాలనుకున్నా, ఆఖరి నిమిషంలో ఆయన సినిమా విడుదల ఫిబ్రవరికి మారింది. అలా వాయిదా పడిన సినిమాలు... ఫిబ్రవరి కోసమే ముస్తాబైన మరికొన్ని సినిమాలు కలిసి అదే నెలలోనే విడుదల ఖరారు చేసుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర పోటీ గట్టిగానే కనిపిస్తోంది. సహజంగా సంక్రాంతికి తెలుగు సినిమాలతోపాటు, ఒకట్రెండు అనువాద చిత్రాలూ విడుదలవుతుంటాయి. కానీ ఈసారి తెలుగు సినిమాల మధ్యే పోటీ ఉండటంతో తమిళం నుంచి చిత్రాలేవీ విడుదల కాలేదు. అప్పుడు రావల్సిన ‘కెప్టెన్ మిల్లర్’, ‘అయలాన్’ చిత్రాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల ఖరారు చేసుకున్నాయి. ఒకవైపు సంక్రాంతి సినిమాలు, మరోవైపు ఈ అనువాదాలతోనే ఈ నెల గడిచిపోతుంది. ఇక ఫిబ్రవరిలోనే కీలకమైన సినిమాలు విడుదల కానున్నాయి.
9వ తేదీ కోసం...
వచ్చే నెల తొలి వారమంతా కూడా థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడే ఉంటుంది. అయినా సరే, కొన్ని పరిమిత వ్యయంతో రూపొందిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, ‘ధీర’, ‘హ్యాపీ ఎండింగ్’ చిత్రాలు ఫిబ్రవరి 2న విడుదల కోసం సిద్ధమయ్యాయి. ఆ వారం తర్వాత వచ్చే 9వ తేదీ కోసం అసలు సిసలు పోటీ అంతా. ఆ తేదీన సోలో విడుదలకి సహకరిస్తామన్న చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి హామీతో రవితేజ ‘ఈగల్’ ఆ తేదీని ఖరారు చేసుకుంది. అయితే అదే రోజే సందీప్కిషన్ కథానాయకుడిగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఆ సినిమా వర్గాలు ప్రకటించాయి. తమిళం నుంచి రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘లాల్ సలామ్’ విడుదల కూడా ఖరారైంది. రజనీ సినిమాకి తెలుగులో ఉండే క్రేజ్ వేరు. ఇలా ఆ తేదీ కోసం సినిమాలు పోటీ పడుతుండడంతో పరిశ్రమ పెద్దలు విడుదలల విషయంలో కసరత్తులకి దిగక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వరుణ్తేజ్.. గోపీచంద్ చిత్రాలు
డిసెంబరులోనే రావల్సిన వరుణ్తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఆలస్యంగా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. వరుణ్తేజ్ నటించిన ద్విభాషా చిత్రమిది. తెలుగుతోపాటు, హిందీలోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎయిర్ఫోర్స్ డ్రామాతో కూడిన కథతో శక్తిప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ‘భీమా’ చిత్రం కూడా వచ్చే నెల 16నే ప్రేక్షకుల ముందుకొస్తోంది. గోపీచంద్ పోలీసు పాత్రలో నటిస్తున్న చిత్రమిది. కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్ శైలి మాస్ అంశాలతో రూపొందిన ఈ సినిమా టీజర్ని ఇప్పటికే విడుదల చేశారు. వీటితోపాటు... మరో చిత్రం ‘సుందరం మాస్టర్’ కూడా అదే తేదీన విడుదల కానుంది. హర్ష చెముడు ప్రధాన పాత్రధారిగా... కల్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ‘టిల్లు స్క్వేర్’, ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ తదితర చిత్రాలూ ఈ నెల కోసమే ముస్తాబవుతూ వచ్చాయి. మరి వీటిలో ఏ సినిమా ఎప్పుడొస్తుందనేది తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
సూపర్ హిట్ మూవీ ‘యానిమల్’ (Animal) గురించి స్పందించారు నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor). ఆ చిత్రంపై వచ్చిన విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. -
యాక్షన్ ఫాంటసీ సిరీస్ను ప్రకటించిన రాజ్ అండ్ డీకే.. టైటిలిదే
రాజ్ అండ్ డీకే కొత్త సిరీస్ను ప్రకటించారు. ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఇది రానుంది. -
అల్లరి నరేశ్ కొత్త సినిమా.. కీలకపాత్రలో యంగ్ హీరోయిన్
అల్లరి నరేశ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ షేర్ చేసింది. -
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. -
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు. -
విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో!
విజయ్ సేతుపతి హిట్ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ దేశంలో ‘హనుమాన్’ రిలీజ్.. ప్రశాంత్ వర్మ పోస్ట్
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. -
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్