Sudheer babu: నటుడిగా అంత స్వార్థంగా ఉండకూడదని తెలుసుకున్నా
‘‘సరైన సమయంలో సరైన ప్రయత్నం చేశాననే తృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు సుధీర్బాబు. తొలి నుంచీ వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్న కథానాయకుడీయన.
‘‘సరైన సమయంలో సరైన ప్రయత్నం చేశాననే తృప్తినిచ్చిన చిత్రమిది’’ అన్నారు సుధీర్బాబు. తొలి నుంచీ వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్న కథానాయకుడీయన. ఇటీవల త్రిపాత్రాభినయంతో ‘మామా మశ్చీంద్ర’ చేశారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం సుధీర్బాబు హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. ఆ అనుభవాల్ని పంచుకుంటారా?
మానసికంగా, శారీరకంగా చాలా సవాళ్లే ఎదురయ్యాయి. నన్నెక్కువగా ఆకర్షించిన విషయం కూడా త్రిపాత్రాభినయమే. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ మొదలుకొని నా కెరీర్లో క్లిష్టమైన పాత్రల్ని కొన్నింటిని చేశా. దాంతో నేను కొత్తగా ప్రయత్నిస్తాననే ఓ బలమైన నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. అందుకు తగ్గట్టే రూపొందిన చిత్రమిది. వాణిజ్య ప్రధానంగా సాగే ఈ సినిమాలో బలమైన కథ కూడా ఉంది.
ఏ పాత్ర ఎక్కువ సవాళ్లని విసిరింది?
ఒక సినిమాలో మూడు పాత్రలు చేస్తున్నప్పుడు ఏదీ ఒకదానికొకటి దగ్గరగా ఉండకూడదు. అలాంటప్పుడు చాలా జాగ్రత్తలు తీసకుని నటించాల్సి ఉంటుంది. మొదట కథ విన్నప్పుడు పరశురామ్, దుర్గ పాత్రల కోసం కష్టపడితే... సిక్స్ ప్యాక్తో కనిపించే మూడో పాత్రని అవలీలగా చేస్తాననుకున్నా. తీరా ఆ రెండు పాత్రలు చేశాక మూడో పాత్రే ఎక్కువగా కష్టం అనిపించింది. 120 కేజీల బరువుతో కనిపించే పాత్ర కోసం నిజంగానే అంత బరువు పెరగాలనుకున్నా. ఇదే విషయం మహేశ్తో చెప్పినప్పుడు.. ఉన్నట్టుండి అంత బరువు పెరగడం మంచిది కాదని చెప్పాడు. ఇంకా చాలా మంది సన్నిహితులు వద్దని వారించారు. దాంతో ప్రొస్థెటిక్ మేకప్తో ఆ పాత్రని చేశా. పాత్రలకి తగ్గట్టుగానే రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర యాసల్లో సంభాషణలు చెప్పా. నిజానికి నాకు ఈ మూడు యాసలూ కొత్తే. నాకు అలవాటైన యాసలోనూ ఓ పాత్రకి డబ్బింగ్ చెప్పా. ఇలా అన్ని కోణాల్లో ఈ సినిమా సవాళ్లు విసిరించింది.
సూపర్స్టార్ కృష్ణ కోసం ఓ పాత్ర రాశారట కదా. ఆయనకి ఈ కథ చెప్పారా?
స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు అనుకున్నాం. అప్పటికే కృష్ణగారు సినిమాలు చేయడం ఆపేశారు. కానీ ఆయన్ని ఎలాగైనా ఒప్పించగలనని, కుదిరితే ఆ సన్నివేశాల్ని ఇంట్లోనే చిత్రీకరణ చేసేలా ప్లాన్ చేశాం. కానీ చేయలేకపోయాం. ఆయన లేకపోతే ఆ సన్నివేశానికి అంత ప్రాధాన్యం ఉండదు. అందుకే ఆ సన్నివేశాలు తీయలేదు. ప్రతి సినిమా విడుదల రోజు మామగారితో మాట్లాడేవరకూ ఎవరి కాల్స్ని తీసేవాణ్ని కాదు. మా సినిమాలు ఎలా ఉన్నాయో ఆయన చెప్పాకే మిగతావాళ్ల అభిప్రాయాలు తెలుసుకునేవాళ్లం. మా జీవితాల్లో ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు.
సూపర్స్టార్ కృష్ణ బయోపిక్లో నటించే అవకాశం వస్తే మీరు సిద్ధమేనా?
నాకు ఆ అవకాశం వస్తే అదరగొడతా. సూపర్స్టార్ బయోపిక్ చేస్తే నా కెరీర్కి ఉపయోగపడుతుందనో లేదంటే ఆయన మామగారు అనో ఆసక్తి చూపడం లేదు. బయోపిక్ చేస్తున్నప్పుడు ఆ కథ తాలూకు ఆత్మని పట్టుకోవడం ముఖ్యం. కృష్ణగారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన జీవితంలో ఎత్తు పల్లాల గురించి, సంఘర్షణ గురించి తెలుసు. బయోపిక్ అంటే... వాళ్లలా నడిస్తేనో, వాళ్లలా హావభావాలు ప్రదర్శిస్తేనో అయిపోదు. సినిమాకి అది అలంకరణ మాత్రమే. అసలు విషయం ఆత్మే. అందుకే కృష్ణగారి బయోపిక్ అవకాశంపై ఆత్రుతగా ఉన్నా.
కథల ఎంపిక పరంగా ఇప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
నటుడిగా నేను స్వార్థంగా ఉండకూడదని నిర్ణయించుకున్నా. ఇదివరకు కొత్తదంటే పరిగెత్తేవాణ్ని. కానీ అది ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని ఆలోచించాలని ‘హంట్’ తర్వాత అర్థం చేసుకున్నా. ఓ సినిమా చేస్తే అది కొత్తగా ఉండాలి, అదే సమయంలో అందరినీ సంతృప్తి పరిచేలా ఉండాలనుకుంటా.
పుల్లెల గోపీచంద్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది?
ఆ సినిమా కచ్చితంగా ఉంటుంది. కానీ అంతకంటే ముందు నా సినిమాలు మూడు విడుదలవుతాయి. ఇదివరకు వేరే నిర్మాణ సంస్థ దగ్గర హక్కులు ఉండేవి. ఇప్పుడు మరో నిర్మాణ సంస్థ వాటిని సొంతం చేసుకుంది. క్రీడాకారుడిగా గోపీచంద్, కోచ్గా గోపీచంద్ ఇలా రెండు భాగాలుగా తీయాలనుకున్నాం. ఆ తర్వాత ఆ నిర్ణయం మారింది. ఇలా స్క్రిప్ట్ దశలో ఉంది ఆ చిత్రం. తదుపరి నా చిత్రం ‘మా నాన్న సూపర్హీరో’ విడుదలవుతుంది. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ‘హరోం హర’ అనే మరో సినిమా చేస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్