Calling Sahasra: ఆ తర్వాత 130 కథలు విన్నా
బుల్లితెరతో ప్రేక్షకులకు చేరువయ్యారు సుడిగాలి సుధీర్. ఇప్పుడు కథానాయకుడిగానూ వెండితెరపై సందడి చేస్తున్నారు.
బుల్లితెరతో ప్రేక్షకులకు చేరువయ్యారు సుడిగాలి సుధీర్. ఇప్పుడు కథానాయకుడిగానూ వెండితెరపై సందడి చేస్తున్నారు. ‘గాలోడు’ విజయం తర్వాత ఆయన కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం ‘కాలింగ్ సహస్ర’. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ప్రయాణం గురించి సుధీర్ గురువారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..
‘కాలింగ్ సహస్ర’ ఎలాంటి సినిమా? ఈ కథని ఒప్పుకోవడానికి ప్రధాన కారణమేమిటి?
ఇది సస్పెన్స్ థ్రిల్లర్ తరహా కథే. నేర నేపథ్యం, ప్రేమ కోణం, డార్క్ వెబ్ అనే మరో కొత్త అంశం... ఇలా మూడు పార్శ్వాలుగా ఉంటుందీ చిత్రం. ‘గాలోడు’ సమయంలోనే ఈ సినిమానీ మొదలుపెట్టాం. ఒకటి మాస్, మరొకటి క్లాస్ అన్నట్టుగా ఉంటుందని ఈ రెండింటినీ ఒకేసారి ఒప్పుకుని చేశా. మాస్ ప్రేక్షకులు అంతగా నన్ను ఆదరిస్తారని ‘గాలోడు’ విడుదల రోజు వరకూ నాకు తెలియదు. మాస్ ప్రేక్షకులు నన్ను అమితంగా స్వీకరించారని ‘కాలింగ్ సహస్ర’ని పక్కనపెట్టలేను కదా! ఈ సినిమానీ అదే స్థాయిలో ఆదరించారంటే ఇకపై నేను ఇలా విభిన్నమైన కథలు ప్రయత్నించేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా నేను మాస్ చేస్తేనే చూస్తారా అనేది కూడా ఈ సినిమా తర్వాత తెలుస్తుంది.
ఇదొక ప్రయోగం అనుకోవచ్చా?
నావరకూ ఇదొక ప్రయోగమే. ఫలితం ఎలా ఉంటుందనేది శుక్రవారం తెలుస్తుంది. నన్ను నేను తెరపై కొత్తగా చూసుకుంటున్న అనుభూతి
కలిగింది.
‘జబర్దస్త్’ ఇమేజ్ మీ దగ్గరికి వచ్చే కథలపై ఎంత వరకూ ఉంటోంది?
నేను వింటున్న కథల్లో ఆ ఇమేజ్ ప్రభావం చాలా ఉంటోంది. లవర్బాయ్ కథలతో కొద్దిమంది, కామెడీ కథలతో కొద్దిమంది వస్తున్నారు. అందులో రొమాంటిక్ కథలు కూడా ఉంటున్నాయి. అయితే ‘జబర్దస్త్’ తరహాలోనే నేను కామెడీ కథే చేశాననుకోండి. ఇక్కడ కామెడీ, అక్కడా కామెడీ కొత్తగా ఏమీ లేదు అంటారు. ఆ కామెడీ కూడా ఆశించిన స్థాయిలో పండలేదంటే, దీనికంటే జబర్దస్త్లోనే మేలు కదా అంటుంటారు. వీటి నుంచి బయట పడాలనే విభిన్నమైన కథలతో ప్రయాణం చేస్తున్నా. అయితే కామెడీ మాత్రం ఎప్పటికీ వదలను. ఇప్పుడు చేస్తున్న కథల్లా కాకుండా నువ్వు నవ్విస్తేనే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తే తప్పకుండా ఆ తరహా కథలతోనే ప్రయాణం చేస్తా.
టెలివిజన్లో వినోదం, సినిమాతో వినోదం పంచడానికి చాలా తేడా ఉంటుంది. ఓ కథానాయకుడిగా ఎలాంటి సవాళ్లని ఎదుర్కొంటున్నారు?
టెలివిజన్ వరకూ రేటింగ్ బాగుండాలి, ప్రేక్షకులు బాగా నవ్వుకోవాలనేదే చూస్తాం. హిట్, ఫ్లాప్ అనేది ఉండదు. నెలకి 15 రోజులు షూటింగ్లు చేసుకుంటూ హాయిగా ప్రయాణం చేసేవాణ్ని. సినిమాకి వచ్చేసరికి చాలా రకాల ఒత్తిళ్లు ఉంటాయి. ప్రేక్షకుడి టికెట్, నిర్మాత పెట్టుబడి, దర్శకుడి కెరీర్... ఇలా చాలా విషయాలు ఉంటాయి. ‘గాలోడు’ తర్వాత కొత్త సినిమాల కోసం కథలు వింటున్న సమయంలో నాకు వెన్నెముక నొప్పి తీవ్రంగా వచ్చింది. వైద్యుల దగ్గరికి వెళితే ఎక్కువ ఒత్తిడి తీసుకుంటున్నావని చెప్పారు. అప్పుడు అర్థమైంది సినిమా ప్రయాణంలో ఎన్ని సవాళ్లు ఉంటాయో! ‘గాలోడు’ తర్వాత దాదాపు 130కిపైగా కథలు విన్నా. ఆ తర్వాత ‘గోట్’ ఎంచుకున్నా. పరాజయం కంటే విజయం విసిరే సవాళ్లు ఎక్కువగా ఉంటాయని అర్థమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం