Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది.
‘లెజెండ్’ పదేళ్ల వేడుకలో కథానాయకుడు బాలకృష్ణ
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. ఆ ప్రభావం అప్పటి ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. మళ్లీ ఈసారి ఎన్నికలకు ముందు రీరిలీజ్గా అదే చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. నాటి రోజులే గుర్తుకొస్తున్నాయి. ఈసారీ జయం మనదే’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెజెండ్’ విడుదలై గురువారంతో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నెల 30న చిత్రాన్ని రీరిలీజ్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి గురువారం రాత్రి హైదరాబాద్లో ప్రత్యేక వేడుకని నిర్వహించారు. చిత్రబృందానికి పదేళ్ల జ్ఞాపికని అందజేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘రికార్డులు నాకు కొత్త కాదు. సృష్టించాలన్నా నేనే, తిరగరాయాలన్నా నేనే. కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతుంటాయి. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ అలాంటివే. 1116 రోజులు, నాలుగు ఆటలు ఆడి మరో కొత్త రికార్డుని దాటిన దక్షిణాది సినిమా నా ‘లెజెండ్’. ఈ మధ్య చేసిన ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ తదితర చిత్రాలు కూడా నాలో కసిని పెంచాయి. ఇలాంటి మంచి సినిమాలు ఇస్తే మరిన్ని చేయండని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు ప్రేక్షకులు. మహిళల గురించి గొప్ప సందేశాన్నిచ్చిన సినిమాలు చేసే అదృష్టం నాకు కలిగింది. ‘లెజెండ్’లో మహిళల గురించి గొప్ప సందేశం ఉంది. సినిమా మాధ్యమం ప్రభావం ఎలా ఉంటుందో రానున్న ఎన్నికల్లోనూ చూస్తారు. ఈ వేడుకకి పసుపు దుస్తుల్లో వచ్చారు కథానాయిక సోనాల్ చౌహాన్. పసుపు అభివృద్ధికి నిదర్శనం. పసుపు ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం. పసుపు ఆత్మగౌరవ పతాకం.
నేను, బోయపాటి శ్రీను కలిసి చేసిన ప్రతి సినిమాలోనూ జరగబోయేది ఏమిటో చెప్పాం. అదే నిజమైంది. ‘లెజెండ్’తోపాటు, ఇటీవల ‘అఖండ’లో కూడా చెప్పాం. అదే నిజం కాబోతోంది. నేనూ, బోయపాటి శ్రీను మాటలతో కాకుండా చేసి చూపిస్తుంటాం. ‘లెజెండ్’ సినిమాకి నటీనటులు, సాంకేతిక నిపుణులు గొప్ప సహకారం అందించారు. అందరికీ ధన్యవాదాలు. నా మనవళ్ల తరంతోనూ కనెక్ట్ అయ్యేలా చేసింది సినిమా. నటుడిగానే కాకుండా, హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్గా నిజజీవితంలోనూ పలు పాత్రల్ని పోషిస్తూ న్యాయం చేకూరుస్తున్నందుకు ఆనందంగా ఉంది. నాకు సహకరిస్తూ, నా అభిమానులూ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ జన్మకిది చాలు. ఈ ప్రోత్సాహం, అనుబంధం అన్ని రంగాల్లో కొనసాగాలని ఆశిస్తున్నా’’ అన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకి కృతజ్ఞతలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్కు సినిమాని అంకితమిస్తూ ‘లెజెండ్’ని మొదలుపెట్టాం. ఆయన ఆశీసులతోనే పదేళ్లయినా ఈ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఒక లెజెండరీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు దర్శకుడిగా గర్వపడుతున్నా. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల’’ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామ్ ఆచంట, సోనాల్ చౌహాన్, గోపీ ఆచంట, ఇతర చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?