Chiranjeevi: చిరంజీవిని కలిసిన రష్యన్‌ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!

చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

Published : 18 Apr 2024 21:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు చిరంజీవిని (Chiranjeevi) కలిసింది. హైదరాబాద్ వచ్చిన ఈ బృందం చిరంజీవి నివాసంలో ఆయన్ని కలిసి.. టాలీవుడ్‌ గురించి చర్చించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రష్యన్‌ క్రియేటివ్‌ ఇండస్ట్రీకి తెలుగు సినిమాలపై ఆసక్తి ఉందని వారు తెలిపినట్లు సమాచారం. అక్కడికి వచ్చి షూటింగ్‌లు చేసుకోవాలని.. ఆ ప్రభుత్వం దీనికి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. టాలీవుడ్‌ సినీ పరిశ్రమకు - రష్యాకు మంచి అనుబంధం ఏర్పడాలని వారు కోరినట్లు తెలుస్తోంది.

మరోవైపు చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న ‘విశ్వంభర’కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌మీడియాలో షేర్‌ అవుతోంది. హైదరాబాద్‌లో దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రెండో పాట కూడా చిత్రీకరణ పూర్తయినట్లు టాక్‌. త్రిష, చిరంజీవిలపై దీన్ని చిత్రీకరించారట. మెగాస్టార్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలవనుంది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం కోసం 18 ఏళ్ల తర్వాత చిరు- త్రిషలు కలిసి నటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని