SSMB 29: ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ

రాజమౌళి-మహేశ్‌ల ప్రాజెక్ట్‌కు సంబంధించి వస్తున్న కథనాలపై నిర్మాణ సంస్ధ క్లారిటీ ఇచ్చింది.

Updated : 17 May 2024 09:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు మహేశ్‌ బాబు (Mahesh Babu) ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ( SSMB29 ) ఎప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన చిన్న విషయం బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కాస్టింగ్‌ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇస్తూ నోట్‌ రిలీజ్‌ చేసింది.

‘రాజమౌళి-మహేశ్‌బాబు ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయి. కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో వెలువడిన కథనాలు మా దృష్టికి వచ్చాయి. కాస్టింగ్‌ డైరెక్టర్‌ వీరేన్‌ స్వామి సినిమాలో భాగమైనట్లు రాశారు. అందులో నిజం లేదు. ఈ మూవీకి సంబంధించి ఏ అప్‌డేట్‌ అయినా మేమే ఇస్తాం. ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వచ్చే అధికారిక ప్రకటనను తప్ప మరే ఇతర అప్‌డేట్‌లను నమ్మొద్దు’ అని శ్రీ దుర్గ ఆర్ట్స్‌ పేర్కొంది.

ఖాన్సార్‌ మరింత ఎరుపెక్కేలా.. ‘సలార్‌2’లో మరో విలన్‌గా మలయాళ నటుడు

ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘మహారాజ్‌’ (Maharaj) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇందులో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని కూడా జోరుగా ప్రచారమవుతోంది. మరోవైపు మహేశ్‌బాబు కూడా ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. తన లుక్‌ను కూడా మార్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని