Cinema News: సినిమా కలలతో... ‘కొంచెం హట్కే’
గురుచరణ్, కృష్ణ మంజూష ప్రధాన పాత్రధారులుగా... అవినాష్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘కొంచెం హట్కే’. అభిమాన థియేటర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
గురుచరణ్, కృష్ణ మంజూష ప్రధాన పాత్రధారులుగా... అవినాష్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘కొంచెం హట్కే’. అభిమాన థియేటర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ నెల 26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం శనివారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకురాలు నందినిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘భిన్న ప్రపంచాల నుంచి వచ్చిన వ్యక్తులంతా కలిసి ఓ సినిమా తీయాలనుకోవడమే ఇందులో కథ. సినిమా తీశారా? వాళ్ల కలలు నెరవేరాయా? అనేది తెరపైనే చూడాలి’’ అన్నారు. కృష్ణ మంజూష. ఈ కార్యక్రమంలో రచయిత కృష్ణ రావూరి, సాయి తదితరులు పాల్గొన్నారు.
తెలుసుకోరా వెనకా ముందరా...
ఆర్ట్స్.. సైన్స్.. ఇంగ్లిష్ కంటే ముందరా... తెలుసుకోరా జరిగేదేంటో వెనకా ముందరా... అంటూ ‘జితేందర్ రెడ్డి’ పాటతో సందడిని షురూ చేశాడు. కళాశాలలో విద్యార్థి నాయకుడిగా, తన ప్రాంతంలో జరిగే అన్యాయాల్ని ఎదుర్కొనేందుకు ధైర్యంగా అడుగేసిన యువకుడిగా ఆయన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపించారో తెలియాలంటే ‘జితేందర్ రెడ్డి’ చూడాల్సిందే. రాకేశ్ వర్రె కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వైశాలి రాజ్, రియా సుమన్ ముఖ్య పాత్రలు పోషించారు. విరించివర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాత. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ‘అఆఇఈఉఊ...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు.
నవ్వించాలనే లక్ష్యం నెరవేరింది
‘‘భయపెట్టడం కంటే కూడా... నవ్వించాలనే ఉద్దేశంతోనే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాని చేశాం. థియేటర్కి వెళ్లిన ప్రేక్షకులంతా కోన వెంకట్ మార్క్ వినోదాన్ని ఆస్వాదిస్తూ, హాయిగా నవ్వుకుంటున్నారు’’ అన్నారు శివ తుర్లపాటి. నృత్య దర్శకుడైన ఆయన, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాతో మెగాఫోన్ చేతపట్టారు. అంజలి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శివ తుర్లపాటి శనివారం విలేకర్లతో ముచ్చటించారు. ఇది సీక్వెల్ సినిమా, అంజలి 50వ సినిమా అనే ఒత్తిళ్లని తీసుకోకుండా చేశా. నవ్వించాలనే లక్ష్యం నెరవేరింది. మూడో భాగం సినిమా త్వరలోనే ఉంటుంది’’ అన్నారు శివ తుర్లపాటి.
మట్టి మనుషుల కథ.. శరపంజరం
నవీన్కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘శరపంజరం’. లయ కథానాయిక. టి.గణపతిరెడ్డి నిర్మాణ సహకారం అందించారు. ఈ చిత్రం ఈ నెల 19న రానున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అతిథిగా హాజరై ట్రైలర్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల వెతల నేపథ్యంలో తీసిన చిత్రమిది. మట్టి మనుషుల జీవితాల్ని తీసుకుని, తొలి ప్రయత్నంలోనే సామాజిక చైతన్యం కోసం పాటుపడే చిత్రాన్ని తీసిన నవీన్ గట్టుకు అభినందనలు’’ అన్నారు.
‘మేకప్ మ్యాన్’ల జీవితం ఆధారంగా
ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేనల్లుడు శ్రీకాంత్ అవుటూరి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘మేకప్ మ్యాన్’. దివాకర్ యడ్ల దర్శకుడు. కుమార్ మెట్టుపల్లి నిర్మాత. శనివారం హైదరాబాద్లో ప్రారంభమైందీ చిత్రం. దర్శకుడు రవికుమార్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్నిచ్చారు. నిర్మాత సాయివెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, భరత్ పారేపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమలో మేకప్ మ్యాన్ ప్రాముఖ్యత చాలా కీలకం. వాళ్ల జీవితాల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’ ఆడకపోవడానికి కారణమిదే!
విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కించిన ‘ఫ్యామిలీస్టార్’ పెద్దగా ఆడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
బుజ్జి అండ్ భైరవ.. యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉంది?
‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రూపొందించిన బుజ్జి అండ్ భైరవ.. యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందంటే? -
రివ్యూ: కీచురాళ్ళు.. మలయాళ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
మలయాళంలో విజయవంతమైన ‘కీడమ్’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ‘కీచురాళ్ళుగా’ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
మా చేతుల్లో ఉండేది కథల ఎంపిక ఒక్కటే!
తొలి సినిమా నుంచే ఎక్స్ప్రెస్ వేగం ప్రదర్శించింది కృతిశెట్టి. ‘ఉప్పెన’ తర్వాత ఆమెకి ఆ సినిమా పేరుకు తగ్గట్టే అవకాశాలు వెల్లువెత్తాయి. -
ఈ టైగర్ చాలా దూరం వెళ్తాడు!
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో థియేటర్లలో సందడి చేస్తున్నారు హీరో విష్వక్ సేన్. -
విజయ్ చిత్రంలో సత్యదేవ్?
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. -
సీక్వెల్లో త్రిష?
‘అమ్మోరు తల్లి’గా అగ్ర కథానాయిక నయనతార అలరించిన సంగతి తెలిసిందే. -
తేనె తీయని వీణ రాగాల తెలంగాణ
రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. -
నవ్వించి.. కదిలించే రఘు తాత
చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది అందాల తార కీర్తి సురేశ్. -
రామోజీ ఫిల్మ్ సిటీలో తమ్ముడు పోరాటం
నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు రూపొందిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. -
ఆకట్టుకునేలా సమంత కొత్త లుక్.. నయనతార ఫ్యామిలీ పిక్స్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
సినిమా చూడకుండానే రివ్యూ ఇచ్చారు: విష్వక్ సేన్
విష్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ శుక్రవారం విడుదలైంది. కొందరు చూడకుండానే రివ్యూలు ఇచ్చారని హీరో అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మూడేళ్లు ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నా.. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!
-
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్
-
తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం
-
ఈవీఎంలను చెరువులోకి విసిరి..బాంబులతో దాడి చేసి..ఎన్నికల వేళ కలకలం
-
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా హాజరుకాకపోవచ్చు : కాంగ్రెస్ వర్గాలు