kandikonda: సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత

హైదరాబాద్: హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన సినీ గేయ రచయిత కందికొండ(49)(kandikonda) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. వెంగళరావు నగర్లోని తన ఇంట్లో కందికొండ తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన ఆ వ్యాధిని జయించినా, ఆ వ్యాధి ప్రభావం వెన్నెముకపై పడటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, స్నేహితుల సహకారంతో ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నా, పూర్తి స్థాయిలో కోలుకోలేదు.
ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ (kandikonda)జన్మించారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఆసక్తి కారణంగా క్రమంగా సినీ రంగంవైపు అడుగులు చేశారు. ఇంటర్ చదువుతున్న సమయంలోనే సంగీత దర్శకుడు చక్రితో స్నేహం ఏర్పడింది. 2001లో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. మంచి మెలోడీ గీతంగా ఆ పాట శ్రోతలను విశేషంగా అలరించింది. దీంతో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. అలా ‘ఇడియట్’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్ ఇన్ లవ్’, ‘పోకిరి’లో ‘గల గల పారుతున్న గోదారిలా’ ‘జగడమే’, ‘లవ్లీ’లో ‘లవ్లీ లవ్లీ’ తదితర పాటలు రాశారు. 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక శ్రీకాంత్ నటించిన ‘కోతలరాయుడు’లో ఒక పాట రాశారు.
20ఏళ్ల సినీ ప్రస్థానంలో 1300లకు పైగా పాటలు రాశారు. మొదట్లో జానపద గీతాలను రాసిన కందికొండ(kandikonda), సినీ సంగీత దర్శకుడు చక్రి ప్రోత్సాహంతో సినిమా పాటలు రాశారు. సినిమా పాటలే కాకుండా బతుకమ్మ నేపథ్యంలో రాసి పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా జనం నోట మార్మోగాయి. పాటలే కాదు, కవిత్వం రాయడంలోనూ కందికొండ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత. మట్టి మనుషుల వెతలు, పల్లెబతుకు చిత్రాలను కథలుగా రచించి కథకుడిగానూ విశేష ఆదరణ పొందారు.
క్యాన్సర్ పోరాడి గెలిచిన తర్వాత కందికొండ(kandikonda)ను వెన్నెముక సమస్య ఇబ్బంది పెట్టింది. మళ్లీ ఆయన ఆస్పత్రి పాలవడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అదే సమయంలో కరోనా విజృంభించడంతో వారి పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో కందికొండ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కందికొండకు చికిత్స అందించారు. కొన్ని రోజులు ఆరోగ్యం నిలకడగా ఉన్నా, ఇటీవల క్షీణించడంతో శనివారం కందికొండ తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతి పట్ల చిత్ర పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఒక మంచి గేయ రచయితను కోల్పోయామని సినీ పరిశ్రమకు చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు.
కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు: సీఎం కేసీఆర్
కందికొండ యాదగిరి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ‘‘తన పాట ద్వారా తెలంగాణ సంస్కృతిని అజరామరంగా నిలిపారు. కందికొండ మరణం సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటు. పాటల రచయితగా తనదైన ముద్ర వేశారు. కందికొండను కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు’’ అని సీఎం పేర్కొన్నారు.
* ‘‘రాష్ట్ర సంస్కృతిని తన సాహిత్యం ద్వారా ప్రజలకు దగ్గర చేశారు. కందికొండ మరణం రాష్ట్రానికి తీరనిలోటు. ఆయన పాటలు తెలంగాణ సాహిత్య చరిత్రలో నిలిచిపోతాయి. సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేశారు’’ - కేటీఆర్
* ‘‘తెలంగాణ సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన రచయిత కందికొండ యాదగిరి మరణం తీరని లోటు. పలు సినిమాలకు పాటలు రాసిన కందికొండ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బతుకమ్మ పాటలతో మంచి ఖ్యాతిని గడించారు. కందికొండ మృతికి నా ప్రగాఢ సానుభూతి’’ - బండి సంజయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్- 2025లో ‘మంజుమ్మల్ బాయ్స్ ’ అదరగొట్టింది. - 
                                    
                                        

పబ్లిక్లో వాళ్ల పేరు చెబితే నన్ను చంపేస్తారు: రష్మిక
రష్మిక ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’ (The Girlfriend). రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహిస్తున్నారు. - 
                                    
                                        

‘బిగ్బాస్-9’ నుంచి మాధురి ఎలిమినేట్.. అతడికి హౌస్లో ఉండే అర్హత లేదంటూ కామెంట్
బిగ్బాస్ సీజన్:9 నుంచి ఈ వారం దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగు పెట్టిన ఆమె తనదైన మాటతీరు, ఆటతో ప్రేక్షకులను అలరించారు. - 
                                    
                                        

మహేశ్ను ఏనాడూ అడగలేదు: సుధీర్బాబు స్పీచ్
‘జటాధర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుధీర్ బాబు తన కెరీర్ను గుర్తుచేసుకున్నారు. - 
                                    
                                        

సందడిగా అల్లు శిరీష్ నిశ్చితార్థం
అల్లు శిరీష్ నిశ్చితార్థం శుక్రవారం జరిగింది. - 
                                    
                                        

వైభవంగా నారా రోహిత్ వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు దంపతులు
నారా రోహిత్, శిరీషల పెళ్లి ఘనంగా జరిగింది. - 
                                    
                                        

ఆ క్లైమాక్స్ను నేను ఊహించలేదు: షారుక్ ఖాన్
ఎక్స్ వేదికగా షారుక్ ఖాన్ తన అభిమానులతో చిట్చాట్ చేశారు. ఆ విశేషాలివీ.. - 
                                    
                                        

‘ఆయన అవార్డులు కొనుక్కొంటారు’: నెటిజన్ కామెంట్పై అభిషేక్ స్ట్రాంగ్ రిప్లై
అవార్డులు కొనుక్కొంటారంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్పై అభిషేక్ బచ్చన్ స్పందించారు. వారు అనుకున్నది తప్పని భవిష్యత్లో నిరూపిస్తానని తెలిపారు. - 
                                    
                                        

అది మామూలు విషయం కాదు.. రవితేజపై సూర్య ప్రశంసలు
‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు కోలీవుడ్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. - 
                                    
                                        

బిగ్బాస్ సీజన్9: రమ్య ఎలిమినేట్.. రీతూపై బిగ్బాంబ్!
బిగ్బాస్ సీజన్ 9’ నుంచి రమ్య మోక్ష (ramya moksha) ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డు ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె త్వరగానే బయటకు వచ్చేయడం గమనార్హం. - 
                                    
                                        

‘యుగానికొక్కడు 2’ ప్రకటించకుండా ఉండాల్సింది: సెల్వ రాఘవన్
‘యుగానికొక్కడు’ (yuganiki okkadu). తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సినిమా - 
                                    
                                        

చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు వాడొద్దు: కోర్టు ఆదేశాలు
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్లను వాడకూడదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. - 
                                    
                                        

మందలించిన డాక్టర్.. అయినా లెక్క చేయని రష్మిక
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక (Rashmika) కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘థామా’ (Thamma). - 
                                    
                                        

ఇతను శర్వానందేనా..! ఇలా మారిపోయాడేంటి..? ఫొటోలు వైరల్
కథ, అందులోని పాత్ర కోసం తమని తాము మార్చుకునే నటీనటులను మనం చూస్తూనే ఉంటాం. - 
                                    
                                        

నన్నూ డ్యూడ్ అంటున్నారు.. దీపికతో మూవీకి రెడీ: శరత్ కుమార్
తాను కీలక పాత్ర పోషించిన ‘డ్యూడ్’ సక్సెస్ మీట్లో నటుడు శరత్ కుమార్ సందడి చేశారు. - 
                                    
                                        

కుమార్తెను పరిచయం చేసిన దీపిక.. సినీ తారల ఫ్యామిలీ పిక్స్ వైరల్
పలువురు సినీ ప్రముఖులు దీపావళిని ఘనంగా జరుపుకొన్నారు. - 
                                    
                                        

రవితేజ కామెంట్.. ‘వార్ 2’ ఫలితంపై నాగవంశీ రియాక్షన్ ఇదీ
‘మాస్ జాతర’ ప్రమోషన్స్లో రవితేజ, నిర్మాత నాగవంశీ సందడి చేశారు. - 
                                    
                                        

చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు.. అతిథులు వీళ్లే..!
అగ్ర కథానాయకుడు చిరంజీవి నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. - 
                                    
                                        

పండగ వేళ.. అనసూయ ఎమోషనల్ పోస్టు
చిన్నతనంలో జరుపుకొన్న దీపావళి వేడుకలు గుర్తుచేసుకుంటూ అనసూయ ఎమోషనల్ అయ్యారు. - 
                                    
                                        

చిన్న నిర్మాత.. ఏం చేసినా భరిస్తాడని అనుకుంటున్నారా?: ‘కె-ర్యాంప్’ ప్రొడ్యూసర్
రేటింగ్స్ విషయంలో బాధపడ్డానని ‘కె- ర్యాంప్’ నిర్మాత ఆవేదన వ్యక్తం చేశారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించం: మంత్రి అనిత
 - 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 - 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 - 
                        
                            

బంగ్లా పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలు బంద్
 


