Triptii Dimri: మాటలు రావడం లేదు: త్రిప్తి డిమ్రి

దిల్జిత్ దొసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అమర్‌సింగ్ చంకీల’.

Updated : 14 Apr 2024 17:05 IST

ముంబయి: పంజాబీ, బాలీవుడ్‌ నటుడు దిల్జిత్‌ దొసాంజ్‌, నటి పరిణితీ చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అమర్‌సింగ్ చంకీల’. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైంది. బాలీవుడ్‌ సినీతారల కోసం ముంబయిలోని ఓ థియేటర్‌లో స్పెషల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న నటి త్రిప్తి డిమ్రి చిత్రబృందాన్ని మెచ్చకున్నారు. దిల్జిత్‌ యాక్టింగ్‌ను వర్ణించడానికి మాటలు రావడం లేదన్నారు.

‘‘చాలా కాలం తర్వాత నేను చూసిన ఉత్తమ చిత్రమిది. ఒక కళాకారుడి నిజాయతీ, అందమైన, హృదయవిదారకమైన ప్రయాణమే ఈ చిత్రం. ఇలాంటి ఆణిముత్యాన్ని మాకు అందించినందుకు థ్యాంక్యూ ఇంతియాజ్‌. దిల్జిత్‌ దొసాంజ్‌ ఎంత అద్భుతంగా నటించాడో వర్ణించడానికి మాటలు రావడం లేదు. ఆయన తన నటనతో అమర్‌సింగ్‌ పాత్రలో ఒదిగిపోయారు. ప్రేక్షకులను సినిమాలో మమేకం అయ్యేలా చేశారు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా చేశారు. అమర్‌ జ్యోత్‌ పాత్రకు పరిణీతి సరిగ్గా నప్పారు’’ అని త్రిప్తి తెలిపారు.

27 ఏళ్ల వయసులోనే హత్యకు గురైన ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్‌ సింగ్ చంకీల జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించారు. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందించారు. దీని కోసం పరిణీతి దాదాపు 30 కిలోల బరువు తగ్గారు. ఇందులో ఆమె పాట కూడా ఆలపించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంపై ఇప్పటికే పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని