vishwambhara: 18ఏళ్ల తర్వాత జంటగా..

‘స్టాలిన్‌’లో జంటగా కనిపించి ప్రేక్షకుల్ని మురిపించారు చిరంజీవి - త్రిష. ఈ విజయవంతమైన జోడీ 18 ఏళ్ల తర్వాత ‘విశ్వంభర’తో తిరిగి తెరపై కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది.

Updated : 06 Feb 2024 09:29 IST

‘స్టాలిన్‌’లో జంటగా కనిపించి ప్రేక్షకుల్ని మురిపించారు చిరంజీవి - త్రిష. ఈ విజయవంతమైన జోడీ 18 ఏళ్ల తర్వాత ‘విశ్వంభర’తో తిరిగి తెరపై కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది. వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న చిత్రమే ‘విశ్వంభర’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర సెట్‌లోకి త్రిష సోమవారం అడుగు పెట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది చిత్ర బృందం. ఇందుకోసం దాదాపు 13 భారీ సెట్‌లను సిద్ధం చేస్తున్నారు. దీంట్లో చిరు భీమవరం దొరబాబుగా వింటేజ్‌ లుక్‌తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తుండగా.. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని