Trisha: త్రిష లెజండరీ మార్నింగ్‌ ట్వీట్‌.. వైరల్‌ అవుతోన్న ఫొటో

చిరంజీవి, కీరవాణిలతో ఉన్న ఫొటోను త్రిష షేర్ చేశారు.

Updated : 21 Mar 2024 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi), త్రిష(Trisha) జంటగా నటిస్తోన్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తోన్న చిత్రం ఇది. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారనే వార్తలు ఇటీవల మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె చిరంజీవి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిలతో కలిసి ఉన్న ఫొటోను ఏ డివైన్‌ అండ్‌ లెజండరీ మార్నింగ్‌ క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. ఈ ఫొటోలతో పాటు ఓ చిన్న కుక్కపిల్లతో త్రిష ఆడుతూ ఉన్న క్యూట్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

‘విశ్వంభర’ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఇది రానుంది. ఇందులో సురభి, ఇషా చావ్లా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 2025 సంక్రాతి కానుకగా జనవరి 10న ఇది విడుదల కానుంది. మరోవైపు తమిళ నటుడు విజయ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ చిత్రంలో త్రిష అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సైన్స్‌ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వెంకట్‌ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవా, స్నేహ, ప్రశాంత్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని