Allu Arjun: అల్లు అర్జున్‌ సినిమాలో త్రిష.. వైరలవుతోన్న వార్త!

అల్లు అర్జున్‌ అప్‌కమింగ్‌ మూవీలో త్రిష నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 01 Apr 2024 16:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ (Allu Arjun)- అట్లీ కాంబోలో ఓ ప్రాజెక్ట్‌ రానుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ కోలీవుడ్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇందులో స్టార్‌ హీరోయిన్‌ త్రిష (Trisha) నటించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కోలీవుడ్‌ సినీ విశ్లేషకులు పోస్ట్‌లు పెడుతున్నారు. త్రిషతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోందట. ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించేటప్పుడే నటీనటులను కూడా వెల్లడిస్తారని టాక్‌. తాజాగా అట్లీ తన రానున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘కచ్చితంగా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇస్తాను. నేను ఎప్పుడూ భిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాను. వేచి చూడండి’ అన్నారు. ఆయన ఈ సినిమా గురించే ఆ కామెంట్స్‌ చేశారని అభిమానులు అనుకుంటున్నారు. త్రిష ఏ పాత్రలో కనిపిస్తారనే దాని గురించి కూడా నెట్టింట చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. ‘పుష్ప ది రైజ్‌’కు కొనసాగింపుగా ఇది సిద్ధమవుతోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌ పరిసరాల్లో జరిగింది. అలాగే, గతేడాది త్రివిక్రమ్‌తో ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. అట్లీ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), కీర్తి సురేశ్‌ (Keerthy Suresh)లతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షారుక్‌-విజయ్‌లతో ఓ మల్టీస్టారర్‌ను ప్రకటించారు. వీటితో పాటు కోలీవుడ్‌ హీరో అజిత్‌ (Ajith) కోసం కూడా స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని