Trisha: ‘విశ్వంభర’.. భాగ్యనగరిలో ముగించారు

‘విశ్వంభర’తో వినోదాలు పంచేందుకు సెట్స్‌లో శ్రమిస్తున్నారు చిరంజీవి.

Updated : 22 Mar 2024 10:59 IST

‘విశ్వంభర’తో వినోదాలు పంచేందుకు సెట్స్‌లో శ్రమిస్తున్నారు చిరంజీవి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్రిష కథానాయిక. ఈ సినిమా గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ తాజాగా పూర్తయినట్లు చిత్ర బృందం గురువారం ప్రకటించింది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌, పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా చిరు, కీరవాణిలతో కలిసి దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది త్రిష. ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో భీమవరం దొరబాబుగా చిరు కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని