Trivikram: పుస్తకం ఎందుకు చదవాలంటే.. త్రివిక్రమ్ మాటల్లో..!
దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. పుస్తకం చదవడం ఎంత ఉపయోగమో చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) సినిమాల్లోని డైలాగులు ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటాయి. అలాగే ఆలోచింపచేసేలా ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకే అభిమానులందరూ ఆయన్ని మాటల మాంత్రికుడని పిలుచుకుంటారు. సినిమా వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాల్లో వేదికలపై ఆయన ఇచ్చే స్పీచ్కు కూడా చాలా మంది అభిమానులుంటారు. సోషల్ మీడియాలోనూ ఆయన మాటలు తెగ షేర్ అవుతూ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడల్లా పుస్తకం గొప్పతనాన్ని చెప్పే త్రివిక్రమ్ మరోసారి తన మాటలతో ఆకట్టుకున్నారు. తాజాగా ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పుస్తకం ఎందుకు చదవాలో చెప్పారు.
పుస్తకం చదవడం వల్ల మనిషిలో ఎంతో మార్పు వస్తుందన్న త్రివిక్రమ్ (Trivikram).. ‘‘టెక్నాలజీతో పాటు ముందుకు వెళ్లాలని.. పుస్తకాలు చదివితే మనం వెనక్కు వెళ్తామని అందరూ అనుకుంటారు. కానీ, అది నా దృష్టిలో తప్పు. మనం ఏదైనా చూసేటప్పుడు, వినేటప్పుడు పక్కవాళ్లతో మాట్లాడతాం. అదే.. పుస్తకం చదివేటప్పుడు మాత్రం పక్కవాళ్లతో మాట్లాడడానికి కుదరదు. అప్పుడు మనతో మనమే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవడం నేటి తరానికి చాలా అవసరం. అప్పుడే మన అభిప్రాయాలను వ్యక్తపరిచే విధానంలో మార్పు వస్తుంది. అవతలి వారు నొచ్చుకోకుండా మాట్లాడగలుగుతాం. సోషల్ మీడియాలో చాలామంది అవతలి వారిని బాధపెట్టేలా కామెంట్స్ చేస్తుంటారు. ఆ విషయం కామెంట్ చేసిన వాళ్లే తెలుసుకోలేకపోతున్నారు. అలా ఎందుకు జరుగుతుందంటే.. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించే లక్షణం మనుషుల్లో తగ్గిపోయింది. చదవడం వల్ల ఆ ఆలోచన పెరుగుతుంది. అప్పుడు మనం ఉన్నతమైన వ్యక్తిగా మారతాం. నేను చదివిన చాలా పుస్తకాలు నాలో మార్పు తీసుకువచ్చాయి. పుస్తకాన్ని మించిన ఉలి మరొకటి ఉండదు. రాయిలాంటి మనిషిని కూడా పుస్తకం శిల్పంలా మారుస్తుంది. చదవడం అన్ని తరాలవాళ్లు అలవాటు చేసుకోవాలి’ అంటూ పుస్తకం గొప్పతనాన్ని చెప్పారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ (Guntur karam) తీస్తున్నారు. మహేశ్బాబు హీరోగా నటిస్తోన్న ఇందులో శ్రీలీల కథానాయిక. సంక్రాంతి సందర్భంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఇందులో నటీనటుల లుక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే తొలిపాట కూడా నెట్టింట ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. -
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు. -
విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో!
విజయ్ సేతుపతి హిట్ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ దేశంలో ‘హనుమాన్’ రిలీజ్.. ప్రశాంత్ వర్మ పోస్ట్
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. -
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది. -
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
తాను సినిమాలు చేయడం మాననని నటుడు విశాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. -
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
తన పెళ్లి వార్తలపై మరోసారి స్పందించారు నటి కీర్తిసురేశ్ (Keerthy Suresh). -
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
కన్నడ నటుడు యశ్ 19వ చిత్రంగా ‘టాక్సిక్’ రూపుదిద్దుకుంటోంది. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ దీనిని తెరకెక్కిస్తున్నారు. -
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
‘హాయ్ నాన్న’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు నాని. ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. -
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
సామాజిక మాధ్యమాల గురించి నటి జాన్వీకపూర్ (Janhvi kapoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చి పొగిడించుకునే మనస్థత్వం తనది కాదని చెప్పారు. -
బాబీ దేవోల్తో యుద్ధానికి సిద్ధమైన అలియా.. వైరలవుతోన్న ‘ఆల్ఫా’ అప్డేట్!
అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న స్పై థ్రిల్లర్ ‘ఆల్ఫా’. దీనికి సంబంధించిన ఓ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్