OTT Movies: దసరా కానుకగా ఆ రెండు సినిమాలు ఓటీటీలో వచ్చేస్తున్నాయి!

అనసూయ, సునీల్‌ కీలక పాత్రల్లో నటించిన ‘దర్జా’చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 02 Oct 2022 01:25 IST

హైదరాబాద్‌: దసరాకు థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా రెండు చిత్రాలు స్ట్రీమింగ్‌ కానున్నాయి.  ‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఉనికి’. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహా వేదికగా అక్టోబరు 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ‘‘మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ యువతి తన జీవితంలో ఎదురైన ఒడుదొడుకులు ఎదుర్కొంటూ తన ఉనికి ఎలా చాటుకుందనేదే సినిమా కథ. రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌ అంజలి అనుపమ స్ఫూర్తితో ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఇది నిజజీవిత కథ కాకపోయినా, ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు.

దసరాకు ‘దర్జా’గా వస్తున్నారు

సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దర్జా’. సలీమ్‌ మాలిక్‌ దర్శకుడు. శివశంకర్‌ పైడిపాటి నిర్మించారు. ఆమని, పృథ్వీ, అక్సాఖాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 22న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాను ఫిక్షనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. ‘దర్జా’ కూడా అక్టోబరు 5న ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని