Tollywood: ఏజెంట్స్.. ఆన్ డ్యూటీ
వెండితెరపై ఎవర్గ్రీన్ హిట్ ఫార్ములాల్లో స్పై థ్రిల్లర్లకు ప్రత్యేకమైన స్థానముంది. గూఢచర్యం నేపథ్యంలో సాగే ఈ కథలపై ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగే కథ, కథనాలు..
వెండితెరపై ఎవర్గ్రీన్ హిట్ ఫార్ములాల్లో స్పై థ్రిల్లర్లకు ప్రత్యేకమైన స్థానముంది. గూఢచర్యం నేపథ్యంలో సాగే ఈ కథలపై ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగే కథ, కథనాలు.. బుర్రకు పదును పెట్టే చిక్కుముడులు.. ఆశ్చర్యపరిచే మలుపులు.. చూపు తిప్పుకోనివ్వని వీరోచిత పోరాటాలు.. దేశభక్తిని తట్టిలేపే హీరోయిజం.. ఇలా బోలెడన్ని వాణిజ్య హంగులకు నెలవున్న కథలివి. అందుకే స్పై కథలకు ప్రపంచవ్యాప్తంగా అంత గిరాకీ. ఇప్పుడిలాంటి థ్రిల్లింగ్ కథలతోనే ప్రేక్షకులకు వినోదాల విందు పంచేందుకు పలువురు కథానాయకులు సిద్ధమవుతున్నారు. మరి తెరపై గూఢచారులు, ఏజెంట్లుగా సందడి చేయనున్న ఆ తారలెవరు? వారి చిత్ర విశేషాలేంటి?
‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ‘దేవర’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న ఆయన.. త్వరలోనే తన తొలి బాలీవుడ్ చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారు. అదే ‘వార్ 2’. యశ్రాజ్ స్పై యూనివర్స్లో భాగంగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. దీంట్లో బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్తో పాటు తారక్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ భారత రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అంతేకాదు యశ్ స్పై యూనివర్స్లో ఈ పాత్ర తరచూ సందడి చేయనుందని.. పూర్తిగా ఆ పాత్ర నేపథ్యంలోనే సోలోగా ఓ సినిమా కూడా పట్టాలెక్కనుందని తెలిసింది. వచ్చే నెలాఖరు నుంచి ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రంగంలోకి దిగనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ సంగీతమందించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘ఫ్యామిలీస్టార్’గా సినీప్రియుల్ని పలకరించేందుకు బాక్సాఫీస్ బరిలో సిద్ధంగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల 5న థియేటర్లలోకి రానుంది. దీని తర్వాత విజయ్.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమాని పునఃప్రారంభించనున్నారు. ఇదీ ఓ ఆసక్తికర స్పై థ్రిల్లర్ కథాంశంతోనే ముస్తాబవుతోంది. ఈ సినిమాలోని తన పాత్ర కోసం విజయ్ తన లుక్ను పూర్తిగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
గోపీ 116 మళ్లీ వస్తున్నాడు..
ఇటీవల కాలంలో తెలుగులో గూఢచర్య నేపథ్య కథలకు మంచి ఊపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘గూఢచారి’ ముందు వరుసలో ఉంటుంది. ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ చిత్రంలో అర్జున్ కుమార్ అలియాస్ ఏజెంట్ గోపీ 116గా అడివి శేష్ చేసిన సాహసాలు సినీప్రియుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పుడదే పాత్రతో మరోసారి మురిపించేందుకు ‘గూఢచారి 2’తో సిద్ధమవుతున్నారు శేష్. అయితే తొలి భాగంలో కథంతా మన దేశం లోపల జరిగే ఆపరేషన్ చుట్టూ తిరగ్గా.. ఈ రెండో భాగంలో దేశం వెలుపల జరిగే ఓ సీక్రెట్ మిషన్ నేపథ్యంలో కథ సాగనుంది. అంతేకాదు దీంట్లో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ పాన్ ఇండియా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం హీరో నిఖిల్ చేయనున్న చిత్రాల్లో ‘ది ఇండియా హౌస్’ కూడా ఒకటి. కథానాయకుడు రామ్చరణ్ సమర్పిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని రామ్ వంశీకృష్ణ తెరకెక్కిస్తున్నారు. భారతీయ చరిత్రలో మరచిపోయిన అధ్యాయంగా మిగిలిపోయిన ఓ ఆసక్తికర కథాంశంతో దీన్ని రూపొందించనున్నారు. ఇదీ గూఢచర్య నేపథ్యమున్న కథాంశమే అని సమాచారం. దీంట్లో దేశభక్తి అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలిసింది. స్వాతంత్య్రానికి పూర్వం లండన్లో జరిగే చిత్రంగా ఉంటుంది. ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న ‘స్వయంభూ’ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.
స్పైగా సామ్ సాహసాలు..
ఓవైపు వెండితెరపై సినిమాలతో సందడి చేస్తూనే.. మరోవైపు ఓటీటీ వేదికగా వెబ్సిరీస్లతోనూ జోరు చూపిస్తోంది సమంత. ఆమె ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్లో నటించిన సంగతి తెలిసిందే. దీంట్లో వరుణ్ ధావన్ కథానాయకుడు. ఇదీ ఓ సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతోనే రూపొందింది. దీంట్లో సామ్ - వరుణ్ స్పై ఏజెంట్స్గా వీరోచిత పోరాటాలతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ సిరీస్ కోసం సమంత డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
తమిళ సీమ నుంచి రానున్నాయి..
ఇటీవల కాలంలో తమిళ చిత్రసీమ నుంచి కూడా పలు స్పై థ్రిల్లర్లు ప్రేక్షకుల్ని మురిపించాయి. వాటిలో కమల్హాసన్ ‘విక్రమ్’ ఒకటి. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘విక్రమ్ 2’ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు లోకేశ్. అయితే ఇది వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కార్తి ‘సర్దార్’ కోసం భారత రా ఏజెంట్ పాత్రలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. పి.ఎస్.మిత్రన్ రూపొందించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినీప్రియుల్ని మెప్పించి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
సూపర్ హిట్ మూవీ ‘యానిమల్’ (Animal) గురించి స్పందించారు నటుడు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor). ఆ చిత్రంపై వచ్చిన విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. -
యాక్షన్ ఫాంటసీ సిరీస్ను ప్రకటించిన రాజ్ అండ్ డీకే.. టైటిలిదే
రాజ్ అండ్ డీకే కొత్త సిరీస్ను ప్రకటించారు. ‘రక్త్ బ్రహ్మాండ్’ పేరుతో ఇది రానుంది. -
అల్లరి నరేశ్ కొత్త సినిమా.. కీలకపాత్రలో యంగ్ హీరోయిన్
అల్లరి నరేశ్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను నిర్మాణ సంస్థ షేర్ చేసింది. -
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో చిరంజీవి ఫ్యామిలీ పాల్గొంది. -
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు
‘గెహ్రీయాన్’ కోసం నటి దీపికా పదుకొణె (Deepika Padukone)తో ఇంటిమేట్ సీన్స్లో నటించడం తననెంతో ఇబ్బందికి గురి చేసిందని బాలీవుడ్ నటుడు తెలిపారు. -
విజయ్ సేతుపతి హిట్ సినిమాను రీమేక్ చేయనున్న బాలీవుడ్ హీరో!
విజయ్ సేతుపతి హిట్ సినిమాను బాలీవుడ్ హీరో రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
ఆ దేశంలో ‘హనుమాన్’ రిలీజ్.. ప్రశాంత్ వర్మ పోస్ట్
తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). త్వరలో ఇది ఓ దేశంలో విడుదల కానుందని ప్రశాంత్ వర్మ తెలిపారు. -
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై నెట్టింట పోస్టులు.. అనుకున్న రోజుకు రావడం కష్టమేనా!
యశ్ ‘టాక్సిక్’ విడుదలపై అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. -
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత