Urvashi Rautela: రాజకీయాల్లోకి ఊర్వశీ రౌతేలా.. నెటిజన్ల కామెంట్స్‌

రాజకీయాల్లోకి అడుగుపెట్టడంపై నటి ఊర్వశీ రౌతేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పటికే టికెట్‌ ఆఫర్‌ ఇచ్చారన్నారు.

Published : 22 Mar 2024 16:41 IST

ముంబయి: పొలిటికల్‌ ఎంట్రీపై నటి ఊర్వశీ రౌతేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను.. ‘‘మీకు రాజకీయాలపై అవగాహన ఉందా?’’ అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘నాకు ఇప్పటికే టికెట్‌ ఆఫర్‌ ఇచ్చారు. రాజకీయాల్లోకి రావాలా? వద్దా? నిర్ణయించుకునే హక్కు ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. కాబట్టి, అభిమానులు ఏది చెబితే అది ఫాలో అవుతా’’ అని బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘‘ఇంతకీ మీకు టికెట్‌ ఇచ్చింది ఎవరు?’’, ‘‘ఏ పార్టీ తరఫున మీరు పోటీ చేయాలనుకుంటున్నారు?’’, ‘‘ఇదంతా నిజమేనా. మనకు అవసరమంటావా’’ అని కామెంట్స్‌ పెడుతున్నారు.

చిన్నతనంలోనే అందాల పోటీల్లో పాల్గొనడంపై స్పందిస్తూ.. ‘‘ఐ యామ్ షీ మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2012 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచా. ఇందులో గెలుపొందిన వారిని ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీలకు పంపిస్తుంటారు. 18 ఏళ్లు నిండినవారే ఆ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. అప్పుడు నా వయసు 17 మాత్రమే. దాంతో ‘మిస్‌ యూనివర్స్‌’కు దూరమయ్యా. ఐ యామ్ షీ మిస్‌ యూనివర్స్‌ ఇండియా యజమానుల్లో ఒకరైన సుస్మితాసేన్‌.. ‘‘ఊర్వశీ.. ఈ పోటీలకు నువ్వు దూరంగా ఉండు’’ అని చెప్పారు. ఆమె మాటలకు జీవితంలో విలువైనది కోల్పోయినట్లు అనిపించింది’’ అని ఆమె చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని