Varalaxmi Sarathkumar: తన చుట్టూ కథ నడిస్తే ఉత్సాహమే కదా!
తన బిడ్డని కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసిందనే కథతో తెరకెక్కిన చిత్రమే మా ‘శబరి’ అన్నారు వరలక్ష్మీ శరత్కుమార్. ఆమె ప్రధాన పాత్రధారిగా... అనిల్ కాట్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది.
తన బిడ్డని కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసిందనే కథతో తెరకెక్కిన చిత్రమే మా ‘శబరి’ అన్నారు వరలక్ష్మీ శరత్కుమార్. ఆమె ప్రధాన పాత్రధారిగా... అనిల్ కాట్జ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల సమర్పకులు. తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఐదు భాషల్లో ట్రైలర్ని విడుదల చేశారు. కథానాయకుడు వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్కుమార్ మాట్లాడుతూ ‘‘నా నట ప్రయాణంలో ప్రత్యేకమైనది ‘శబరి’. తెలుగులో నేను చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రమిదే. తన పాత్ర చుట్టూ నడిచే సినిమా చేయడం ఏ నటికైనా ఉత్సాహాన్నిస్తుంది. మంచి కథతో రూపొందిన చిత్రమిది. అనూహ్యమైన మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్ని పంచుతుంది. చాలా రోజుల తర్వాత ఇందులో డ్యాన్స్ చేశా. నేనీ సినిమాకి సంతకం చేసేటప్పటికి నాకు ఇన్ని విజయాలు లేవు. కానీ నన్ను, కథని నమ్మి రాజీపడకుండా సినిమా చేశారు నిర్మాత. అద్భుతమైన కథతో ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు అనిల్. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ‘హనుమాన్’ సినిమా అంత పెద్ద విజయం సాధించింటే కారణం తెలుగు ప్రేక్షకులే. నచ్చితే ‘శబరి’ని కూడా అదే స్థాయిలో ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. నిర్మాతకి విజయాలు వస్తే కొత్తవాళ్లకి అవకాశాలు ఇస్తార’’న్నారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘‘చాలా మంది దర్శకనిర్మాతలతో ప్రయాణం చేశా. కానీ నిర్మాత మహేంద్రతో ప్రయాణం గొప్పగా ఉంది. ఆయనతో నేనొక సినిమా చేస్తున్నా. ‘శబరి’ ట్రైలర్ చాలా బాగుంది. ఇదివరకు ‘మైఖేల్’ సినిమాలో నేను, వరలక్ష్మి నటించాం. మా మధ్యలో సన్నివేశాలు లేవు కానీ, భవిష్యత్తులో ఆమెతో కలిసి నటించాలని ఉంది. ప్రేక్షకులంతా ఈ సినిమాని థియేటర్లలో చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘తొలి సినిమానే వరలక్ష్మితో కలిసి చేయడం ఆనందంగా ఉంది. ఆమె నిర్మాత గురించి ఆలోచించే నటి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అమర్దీప్, శశాంక్, ప్రభు, ఫణి, నాని చమిడిశెట్టి, ఆశిష్ తేజ్, మానస నున్న, రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్పై ‘రాయన్’ టీమ్ ఆనందం వ్యక్తంచేసింది. -
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే