Vijay: తల్లి కోసం గుడి కట్టించిన హీరో విజయ్‌

తన తల్లిదండ్రులకు ఎంతో విలువనిస్తుంటారు కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay). తాజాగా ఆయన తన తల్లి కోసం ఓ దేవాలయాన్ని కట్టించారు.

Published : 12 Apr 2024 16:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన తల్లి శోభ కోరిక మేరకు నటుడు విజయ్‌ దేవాలయం కట్టించారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఆయా కథనాలను ఉద్దేశించి శోభ తాజాగా స్పందించారు. ఆ వార్తల్లో నిజం ఉందన్నారు. ‘‘సాయిబాబా  మందిరం నిర్మించాలని నాకు ఎప్పటినుంచో కోరిక ఉండేది. ఈ విషయాన్ని విజయ్‌తో ఎన్నోసార్లు పంచుకున్నా. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని కొంతకాలం క్రితం దీనిని నిర్మించాడు. ప్రతీ గురువారం నేను ఇక్కడికి వస్తుంటా. స్వామి వారిని దర్శించుకుంటుంటా. విజయ్‌ కూడా పలు సందర్భాల్లో ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు’’ అని ఆమె చెప్పారు. పేదల కోసం ఇక్కడ రోజూ అన్నదానం చేసే యోచనలో ఉన్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది.

‘లియో’ తర్వాత విజయ్ నటిస్తోన్న చిత్రం ‘గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. వెంకట్‌ ప్రభు దర్శకుడు. టైమ్‌ ట్రావెల్‌ కథతో సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా ఇది సిద్ధం కానుంది. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ప్రశాంత్‌, ప్రభుదేవా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ రష్యాలో జరుగుతుంది. ఇటీవల విజయ్‌.. చెన్నైలోని ఓ సాయిబాబా దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ పూజారులతో ఫొటో దిగారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఆ దేవాలయాన్ని విజయ్‌ కట్టించారు’ అని పలువురు కామెంట్స్‌ చేశారు. దీనిపై తాజాగా శోభ స్పష్టతనిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని