Vijay sethupathi: ట్రైన్‌ పరుగు మొదలు

దక్షిణాది చిత్రసీమలో ఉన్న బహుముఖ కథానాయకులలో విజయ్‌ సేతుపతి ఒకరు. ఆయన నటించిన ఏ సినిమాలోనైనా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.

Updated : 02 Dec 2023 09:45 IST

దక్షిణాది చిత్రసీమలో ఉన్న బహుముఖ కథానాయకులలో విజయ్‌ సేతుపతి ఒకరు. ఆయన నటించిన ఏ సినిమాలోనైనా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. యాక్షన్‌తో మెప్పించగలరు. కామెడీతో నవ్వించగలరు. ప్రేమకథ చిత్రాలతో అలరించగలరు. ఇటీవల ఐఎమ్‌డీబీ విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ 2023 జాబితాలో టాప్‌ టెన్‌లో నిలిచిన విజయ్‌ తదుపరి ‘ట్రైన్‌’ అనే తమిళ చిత్రంలో నటించనున్నారు. మిస్కిన్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాని వీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేస్తూ షూటింగ్‌ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఆ పోస్టర్‌లో విజయ్‌ రస్టిక్‌లుక్స్‌, రైలు పట్టాలు కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలో డింపుల్‌ హయాతి కథానాయిక. గణేష్‌ వెంకట్రామన్‌, నాజర్‌, సంపత్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వీజేఎస్‌51...షూటింగ్‌ పూర్తి

విజయ్‌ సేతుపతి, రుక్మిణి వసంత్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘వీజేఎస్‌51’(వర్కింగ్‌ టైటిల్‌). తాజాగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటోను పంచుకుంది చిత్రబృందం. త్వరలో ఈ సినిమా టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని తెలిపింది. ఆరుముగ కుమార్‌ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతమందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని