Vijay sethupathi: ట్రైన్ పరుగు మొదలు
దక్షిణాది చిత్రసీమలో ఉన్న బహుముఖ కథానాయకులలో విజయ్ సేతుపతి ఒకరు. ఆయన నటించిన ఏ సినిమాలోనైనా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.
దక్షిణాది చిత్రసీమలో ఉన్న బహుముఖ కథానాయకులలో విజయ్ సేతుపతి ఒకరు. ఆయన నటించిన ఏ సినిమాలోనైనా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. యాక్షన్తో మెప్పించగలరు. కామెడీతో నవ్వించగలరు. ప్రేమకథ చిత్రాలతో అలరించగలరు. ఇటీవల ఐఎమ్డీబీ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ 2023 జాబితాలో టాప్ టెన్లో నిలిచిన విజయ్ తదుపరి ‘ట్రైన్’ అనే తమిళ చిత్రంలో నటించనున్నారు. మిస్కిన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాని వీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.థాను నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ని విడుదల చేస్తూ షూటింగ్ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఆ పోస్టర్లో విజయ్ రస్టిక్లుక్స్, రైలు పట్టాలు కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయిక. గణేష్ వెంకట్రామన్, నాజర్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వీజేఎస్51...షూటింగ్ పూర్తి
విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటిస్తున్న చిత్రం ‘వీజేఎస్51’(వర్కింగ్ టైటిల్). తాజాగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటోను పంచుకుంది చిత్రబృందం. త్వరలో ఈ సినిమా టైటిల్ని, ఫస్ట్లుక్ను విడుదల చేస్తామని తెలిపింది. ఆరుముగ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.