vijay sethupathi: రెండు సినిమాలతో ఆగిపోతాననుకున్నా
‘నాకు హిందీ భాషపై పెద్దగా పట్టు లేకపోవడంతో ఒకట్రెండు సినిమాలకే పరిమితం అవుతా అనుకున్నాను తప్ప ఇన్ని చిత్రాలు చేస్తాననుకోలేదు’ అంటున్నారు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.
Updated : 08 Jan 2024 09:26 IST
- ‘నాకు హిందీ భాషపై పెద్దగా పట్టు లేకపోవడంతో ఒకట్రెండు సినిమాలకే పరిమితం అవుతా అనుకున్నాను తప్ప ఇన్ని చిత్రాలు చేస్తాననుకోలేదు’ అంటున్నారు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. బాలీవుడ్లో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకున్న ఆయన నటించిన ‘మెరీ క్రిస్మస్’ ఈ నెల 12 విడుదలవుతోంది. ప్రచారంలో భాగంగా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు సేతుపతి.
- హిందీ జనం చూపిస్తున్న అభిమానం, ప్రేమ నాకు గొప్ప ఆశీస్సుల్లాంటివి. ఇంతగా ఆదరిస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకంటే నా హిందీ భాషా నైపుణ్యం అలాంటిది. ‘ముంబైకర్’, ‘గాంధీ టాక్స్’ చిత్రాల కోసం కొందరు నన్ను సంప్రదించినప్పుడు అవే ఆఖరు.. ఇంకేం చేయలేను అనుకునేవాడిని.
- మొదటి రెండు చిత్రాలు పూర్తవముందే ‘ఫర్జీ’, ‘జవాన్’ అవకాశాలు వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయా. హిందీ ఫిల్మ్మేకర్లు, జనం అంతగా ఆదరిస్తుంటే దీన్నో గౌరవంగా భావించాను. వాళ్లకు నచ్చేలా నేనూ తప్పకుండా వందశాతం ఇవ్వాలనుకున్నాను.
- మొదట్లో నా హిందీ యాస చూసి ప్రేక్షకులు ట్రోల్ చేస్తారు అనుకునేవాడిని. అదే సందేహాన్ని ‘ఫర్జీ’ అసిస్టెంట్ డైరెక్టర్ గోస్వామి ముందుంచా. ‘ఇక్కడివాళ్లు మిమ్మల్ని తప్పకుండా ఇష్టపడతారు’ అందామె. అన్నట్టుగానే ఆ సిరీస్లో జనం నా తిట్లను కూడా ఎంజాయ్ చేశారు. దీన్నిబట్టి నాకు అర్థమైంది ఏంçంటే ఒక్కసారి ప్రేక్షకులు మనకి కనెక్ట్ అయితే ఇష్టపడుతూనే ఉంటారు.
- బాలీవుడ్లో నాకొచ్చిన క్రెడిట్ మొత్తాన్ని దర్శకులు, రచయితలకు ఇస్తాను. ఈ పాత్రను విజయ్ పోషించాలి అని కొందరు దర్శకులు అనుకోవడం, రచయితలు నా పాత్రని మలచడం.. నాకోసం ఒక మాస్ ఎనర్జీని సృష్టించడం.. అది దర్శక, రచయితల వల్లే అయ్యింది.
- ఏడేళ్ల కిందట ఒక ఫ్రెండ్.. శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన ‘ఏక్ హసీనా థీ’ సినిమా డీవీడీ ఇచ్చి చూడమన్నాడు. నాకు బాగా నచ్చిందా సినిమా. తర్వాత అతడి యాక్షన్ థ్రిల్లర్ ‘బద్లాపూర్’ కూడా చూశాను. దాన్ని తమిళంలో రీమేక్ చేస్తే.. నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్ర పోషించాను. తర్వాత నేను, శ్రీరాం మెల్బోర్న్లో ఒకసారి కలిసినప్పుడు పిచ్చాపాటీగా మాట్లాడుకున్నాం. కానీ ‘మెరీ క్రిస్మస్’లో కథానాయకుడి పాత్ర ఇస్తారని అస్సలు ఊహించలేదు.
- శ్రీరాం రాఘవన్ టేకింగ్ బాగా నచ్చుతుంది. అతడితో కలిసి పని చేస్తే చాలనుకున్నా. ఏకంగా ప్రధాన పాత్ర పోషించడం నాకు బోనస్. శ్రీరాంతో ఇన్నాళ్లు కలిసి ప్రయాణించాక వ్యక్తిగతంగానూ తనపై గౌరవం పెరిగింది. ‘మెరీ క్రిస్మస్’లో నేను ఆల్బర్ట్ అనే మంచి మనసున్న అమాయకుడి పాత్రలో కనిపిస్తాను.
Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.