Vishwak Sen: ఆయన చేసిన దానివల్ల నేనే ఎక్కువ నష్టపోయా: విశ్వక్సేన్
వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో విశ్వక్సేన్. ఒకరు చేసిన పని వల్ల తాను నష్టపోయానని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా ప్రముఖ నటుడు అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమై, ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈమేరకు అప్పట్లో ప్రెస్మీట్ పెట్టి, విశ్వక్సేన్ కమిట్మెంట్ లేని నటుడని అర్జున్ ఆరోపించడం చర్చనీయాంశమైంది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆ పరిణామంపై ప్రశ్న ఎదురవగా విశ్వక్ స్పందించారు.
‘‘బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోకి ఇలానే జరిగితే ఏమయ్యేది? నేను సినిమాని క్యాన్సిల్ చేయమని చెప్పలేదు. ఒక్కరోజు షూటింగ్ ఆపమన్నానంతే. దానికే ఆయన మా ఇంటికొచ్చి అమ్మ, నాన్నలకు విజ్ఞప్తి చేయడం లాంటివి ఎన్నో జరిగాయి. అవి ఎవరికీ తెలియదు. నాకు సినీ నేపథ్యం లేదనో, ఇంకేదో అనుకుని ప్రెస్మీట్ పెట్టారు. కానీ, నేను ఆ విషయాన్ని సాగదీయాలనుకోలేదు. నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను తీసుకున్న పారితోషికానికి రెట్టింపు వెనక్కి ఇచ్చేశా. ఆయన కోపంలో చేసిన దానివల్ల ఎక్కువ నష్టపోయింది నేనే’’ అని అన్నారు.
అదే ఇంటర్వ్యూలో.. ప్రముఖ హీరోలు బాలకృష్ణ, రామ్చరణ్, ఎన్టీఆర్, రానాలతో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘సవారి’ దర్శకుడితో సినిమా ఇంకా ప్రారంభం కాకపోవడంపై స్పందిస్తూ.. ఫస్టాఫ్ స్టోరీ పూర్తయిందని, సెకండాఫ్ విషయంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అందుకే ఆ ప్రాజెక్టు ఆలస్యమైందని, ఎప్పటికైనా నటిస్తానని తెలిపారు. కాలేజీ నేపథ్యంలో ఆ కథ సాగుతుందన్నారు. విశ్వక్ నటించిన ‘గామి’ (Gaami) సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. నూతన దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విశ్వక్.. అఘోరాగా కనిపించనున్నారు. ఆయన నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. 1990ల నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకుడు. నేహా శెట్టి కథానాయిక. 2023 డిసెంబరులోనే విడుదలవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. హీరోగా మరో రెండు చిత్రాలు, నిర్మాతగా ఓ సినిమాతో బిజీగా ఉన్నారు విశ్వక్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం