Chiranjeevi: చిరు ‘విశ్వంభర’.. హైలైట్‌ షెడ్యూల్‌ పూర్తి!

చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్‌ సన్నివేశాలు హైలైట్‌ కానున్నాయి. దీని షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం.

Published : 22 Apr 2024 14:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ‘భారీ సెట్‌లో యాక్షన్‌ ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తయింది. 26 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో ఇంటర్వెల్‌ ఫైటింగ్‌ సీన్స్‌ను చిత్రీకరించారు. ఇందుకోసం 54 అడుగుల హనుమాన్‌ విగ్రహాన్ని రూపొందించారు. ఈ సన్నివేశం సినిమాకే అదనపు ఆకర్షణ కానుంది. యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌ లక్ష్మణ్‌ పర్యవేక్షణలో దీన్ని చిత్రీకరించారు. హైలెవెల్‌ వీఎఫ్‌ఎక్స్‌లతో ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు’ అని సినీ వర్గాల వెల్లడించాయి. ఇటీవల హనుమాన్‌ విగ్రహం వద్ద చిరు దిగిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. ఇది సినిమాలో ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ‘విశ్వంభర’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. 18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష ఈ సినిమా కోసం కలిసి నటిస్తుండడంతో దానిపై అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమిస్తూ  రూపొందిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలవనుంది. ఇక  దీనిలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్‌. ఆమెతో పాటు సురభి, ఇషాచావ్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని