Vijay Sethupathi: క్రేజీ మూవీ ఫ్రాంచైజీ.. విజయ్ సేతుపతి ఎందుకు వైదొలగారంటే..?

తమన్నా, రాశీఖన్నా ప్రధాన పాత్రధారులుగా సుందర్‌.సి తెరకెక్కించిన చిత్రం ‘అరణ్మనై 4’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది.

Published : 31 Mar 2024 16:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోలీవుడ్‌ దర్శకుడు సుందర్‌.సి తెరకెక్కిస్తోన్న సరికొత్త చిత్రం ‘అరణ్మనై 4’. రాశీఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. నటుడు విజయ్‌ సేతుపతి ఇందులో హీరోగా నటించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి పక్కకు తప్పుకున్నారు. ఆయన భాగం కాకపోవడంపై దర్శకుడు సుందర్‌ స్పందించారు.

‘‘ నా గత చిత్రాలతో పోలిస్తే ఇది ఎంతో విభిన్నమైన కాన్సెప్ట్‌. హీరో పాత్ర కీలకంగా ఉండనుంది. అతడి చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. విజయ్‌ సేతుపతి నటించాల్సింది. డేట్స్‌ విషయంలో క్లాష్‌ రావడంతో ఈ చిత్రాన్ని చేయలేకపోయారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పడంతో చివరకు నేనే ఆ పాత్ర పోషించాల్సి వచ్చింది. తమన్నా - రాశీఖన్నా అద్భుతంగా యాక్ట్‌ చేశారు. తమన్నా ఇందులో తల్లి పాత్ర పోషించారు’’ అని చెప్పారు.

‘అరణ్మనై’ ఫ్రాంచైజీ దాదాపు పదేళ్ల క్రితం మొదలైంది. 2014లో విడుదలైన ‘అరణ్మనై’ సూపర్‌హిట్ అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా ‘అరణ్మనై 2’ తెరకెక్కించారు సుందర్‌. 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత 2021లో ‘అరణ్మనై 3’ విడుదలైంది. రాశీఖన్నా, ఆర్య, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని