Raashii Khanna: మీరు లేకపోతే నేను లేను: రాశీఖన్నా

తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేశారు రాశీఖన్నా.

Published : 26 Feb 2024 23:24 IST

హైదరాబాద్‌: ‘మీరు లేకపోతే నేను లేను’ అంటూ తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రముఖ నటి రాశీఖన్నా (Raashii Khanna). ఈమె, బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రా (Sidharth Malhotra) కలసి నటించిన చిత్రం ‘యోధ’ (Yodha). సాగర్‌ అంబ్రే, పుష్కర్‌ ఓఝా సంయుక్తంగా తెరకెక్కించారు. మార్చి 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాశీ, సిద్ధార్థ్‌ పాల్గొని, సందడి చేశారు. షూటింగ్స్‌ పరంగా టాలీవుడ్‌, బాలీవుడ్‌లో తేడా ఏం గమనించారని ఓ విలేకరి ప్రశ్నించగా రాశీ సమాధానమిచ్చారు. హీరోయిన్‌గా నటించిన తన తొలి తెలుగు సినిమా ‘ఊహలు గుసగుసలాడే’ గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పారు.

‘‘నా మాతృభాష హిందీ కాబట్టి అక్కడ నటించడం కష్టమనిపించలేదు. తెలుగులోనూ కంఫర్ట్‌ ఫీలయ్యా. నేనిలా ఉండడానికి ఓ కారణం తెలుగు ఆడియన్సే. నేను నా కెరీర్‌ని ప్లాన్‌ చేసుకోలేదు. అందుకే దాదాపు పదేళ్ల తర్వాత బాలీవుడ్‌లో నటించా. ‘యోధ’ స్క్రిప్టు విన్న వెంటనే నచ్చింది’’ అని రాశీ పేర్కొన్నారు. ‘‘నాకు తెలుగు దర్శకులు, హీరోలంటే అభిమానం. వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటా. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ది బెస్ట్‌. డైరెక్టర్‌ రాజమౌళితో కలిసి పనిచేయాలనుంది’’ అని సిద్ధార్థ్‌ మనసులో మాట బయటపెట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని