మహా యుద్ధం
మహారాష్ట్రలోని కీలకమైన ముంబయితోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది.
ముంబయి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాలపై ఉత్కంఠ
20న పోలింగ్
మహారాష్ట్రలోని కీలకమైన ముంబయితోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఉమ్మడి శివసేనకు పట్టున్న ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పార్టీ చీలిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వ ప్రాభవం ఒకవైపు.. ముంబయిలో మెగా ప్రాజెక్టుల పూర్తి మరోవైపు ఇక్కడి పోటీని ఆసక్తిగా మలిచాయి. శిందే తిరుగుబాటును, ధరల పెరుగుదలను, ధారావి ప్రాజెక్టులో అదానీ ప్రవేశాన్ని ఉద్ధవ్ సేన ప్రశ్నిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే ముంబయితోపాటు ఠాణె, కల్యాణ్ ప్రాంతాల్లో తమ కుటుంబ ప్రాభవాన్ని గుర్తు చేస్తున్నారు. తమదే అసలైన శివసేన అని నిరూపించేందుకు పోరాడుతున్నారు. మరోవైపు శివసేన, ఎన్సీపీలను చీల్చిన భాజపా కొంత ఇబ్బంది పడుతున్నట్లే కనిపిస్తోంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలకు అనుబంధంగా ఉండేందుకు ఇష్టపడటం లేదు.
గిరిజన ప్రాబల్యం
- ముంబయికి ఉత్తరాన ఉన్న ధులే నియోజకవర్గంలో గిరిజనుల ప్రాబల్యం ఉంటుంది. వ్యవసాయమే ప్రధాన వృత్తి. వర్షాధారంగానే పంటలు పండుతాయి. పాల ఉత్పత్తిలో ఈ ప్రాంతానికి మంచి పేరుంది.
- 1996దాకా కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ తర్వాతి నుంచి భాజపా, కాంగ్రెస్ గెలుస్తూ వస్తున్నాయి. 2009, 2014, 2019లలో భాజపా గెలిచింది. ఈసారి భాజపా నుంచి సుభాష్ రాంరావ్, కాంగ్రెస్ తరఫున శోభా దినేశ్ పోటీ చేస్తున్నారు. వీబీఏ, మజ్లిస్ పోటీలో లేకపోవడంతో రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు సాగుతోంది. గత 15ఏళ్లుగా ముస్లిం ఓట్ల విభజనతో భాజపా లబ్ధి పొందుతోంది. ఈసారి ఆ పరిస్థితి లేదు.
గుజరాత్ పొరుగు
- గుజరాత్ సరిహద్దుల్లో ఉండే డిండౌరీ ప్రజల్లో ఎక్కువ మంది అక్కడే ఉద్యోగాలు చేస్తుంటారు. స్వామి సమతా ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఉంది. ఆధునిక గ్రామాలతోపాటు గిరిజన ప్రాంతాలు ఇక్కడ ఉంటాయి. ఉల్లి, ద్రాక్ష భారీగా ఉత్పత్తి అవుతాయి.
- 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా తరఫున సిటింగ్ ఎంపీ భారతీ ప్రవీణ్ పవార్, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) నుంచి భాస్కర్ మురళీధర్ భగారే పోటీ చేస్తున్నారు. ఈసారి భారతీ పవార్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
గోదావరి తీరం
- గోదావరి తీరాన ఉన్న నాసిక్ పురాతన నగరం. ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. 2014, 2019లో అవిభాజ్య శివసేన నేత హేమంత్ గాడ్సే విజయం సాధించారు. ఇక్కడ 60శాతం మంది మరాఠాలు ఉన్నారు. దీంతో రెండు పార్టీలు మరాఠా నేతలకే టికెట్లు ఇచ్చాయి.
- ఈ సారి శివసేన విడిపోవడం, భాజపాతో పొత్తు చెదరడంతో రెండు శివసేనల మధ్యే పోరు సాగుతోంది. శిందే వర్గం నుంచి హేమంత్ గాడ్సే, ఉద్ధవ్ వర్గం తరఫున రాజభావ్ వాజే పోటీ చేస్తున్నారు. ఉద్ధవ్ వర్గానికే కాస్త మొగ్గు కనిపిస్తోంది.
కొంకణీల అడ్డా
- కోలీ, కొంకణీల అడ్డా భివండీ. చిన్న పట్టణంగా ఉన్న ఇది వస్త్ర పరిశ్రమల రాకతో నగరంగా మారింది. ఇక్కడి ప్రజల్లో ఎక్కువ మంది పవర్ లూమ్ పరిశ్రమల్లో పనిచేస్తారు. తెలుగువారూ ఇక్కడ అధికంగానే ఉంటారు.
- 2014, 2019లలో భాజపా ఇక్కడ విజయం సాధించింది. మరోసారి ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. శరద్ పవార్ పార్టీ నుంచి సురేశ్ మాత్రే బరిలోకి దిగారు. గ్రామాల్లో చాలాకాలం నుంచి పని చేస్తున్న నీలేశ్ వీరిద్దరికీ గట్టి పోటీ ఇస్తున్నారు.
కోట గోడ
- మొగలుల హయాంలో కల్యాణ్లోని కోట చుట్టూ పెద్ద గోడను నిర్మించారు. ప్రస్తుతం ముంబయి శివార్లలో ఉన్న అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది.
- 2014, 2019లలో ఇక్కడి నుంచి సీఎం ఏక్నాథ్ శిందే కుమారుడు శ్రీకాంత్ శిందే గెలిచారు. హ్యాట్రిక్ సాధించేందుకు మరోసారి బరిలోకి దిగారు. ఉద్ధవ్ సేన నుంచి వైశాలి దరేకర్-రాణె పోటీ చేస్తున్నారు. ఆదిత్య ఠాక్రే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. దీంతో శ్రీకాంత్ శిందే గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.
ముంబయికి పెద్దక్క
- ముంబయికి పెద్దక్కగా పిలిచే ఠాణె కెమికల్, ఇంజినీరింగ్, వస్త్ర పరిశ్రమలున్న పెద్ద ప్రాంతం. తయారీ, ఐటీ రంగాల్లో భారీ వృద్ధిని నమోదు చేస్తోంది. ఇక్కడ మరాఠీ, హిందీ, ఆంగ్లం మాట్లాడుతుంటారు.
- 2014, 2019లలో ఇక్కడి నుంచి అవిభాజ్య శివసేన గెలిచింది. ఈసారి ఉద్ధవ్ వర్గం నుంచి ఎంపీ రాజన్ విఖారే, శిందే వర్గం తరఫున నరేశ్ గణపత్ మాస్కే పోటీ చేస్తున్నారు. శివసేనకు ఇది కంచుకోట.. అయితే ఏ సేనకు జనం మద్దతు పలుకుతారనేది ఆసక్తికరంగా మారింది.
మత్స్యకారుల నేల
- మత్స్యకారులు, గిరిజనులు, మధ్య తరగతి వారుండే ప్రాంతం ఉత్తర ముంబయి నియోజకవర్గం. ఇది తీర, అటవీ ప్రాంతాలతో నిండి ఉంటుంది.
- 2014, 2019లలో భాజపా గెలిచింది. ఈసారి భాజపా తరఫున కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. భాజపాకు ఇది సురక్షిత స్థానం.
తొలి అణు విద్యుత్తు కేంద్రం
- గిరిజన ప్రాబల్యమున్న పాల్ఘర్లో హిందీ మాట్లాడేవారు గణనీయంగా ఉంటారు. భారత తొలి అణు విద్యుత్తు కేంద్రం ఇక్కడి తారాపుర్లో ఉంది. సపోటా ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
- 2014, 2019లలో శివసేన ఇక్కడ గెలిచింది. ఈసారి భాజపా అభ్యర్థిగా హేమంత్ విష్ణు సావరా, ఉద్ధవ్ వర్గం నుంచి భారతీ భరత్ కామ్డీ, వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) నుంచి విజయ్ రాజ్కుమార్ మాత్రే తలపడుతున్నారు. ఈ ప్రాంతంలో ఉద్ధవ్ చేసిన అభివృద్ధిపై శివసేన (ఉద్ధవ్) ఆధారపడుతోంది. హిందువుల ఓట్లపై భాజపా ఆధారపడుతోంది.
బాలీవుడ్ కేంద్రం
- బాలీవుడ్ పరిశ్రమ ఉన్న ప్రాంతం వాయవ్య ముంబయి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గతంలో ఇక్కడి నుంచి ప్రముఖ నటుడు సునీల్ దత్ 18ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించారు. సంపన్న ప్రాంతాలతోపాటు మురికివాడలు, ముస్లింల ఆవాస ప్రాంతాలు ఇక్కడ ఉంటాయి.
- 2014, 2019లలో ఉమ్మడి శివసేన ఇక్కడ గెలిచింది. ఈసారి ఉద్ధవ్ వర్గం నుంచి అమోల్ కీర్తికర్, శిందే వర్గం నుంచి రవీంద్ర వైకర్ తలపడుతున్నారు. వీరిద్దరూ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.
ధారావి గడ్డ
- ఆసియాలోనే అతి పెద్ద మురికవాడ ధారావి దక్షిణ మధ్య ముంబయి నియోజకవర్గంలోనే ఉంది. ఎన్నికల్లో ఇక్కడి ప్రజలే ఫలితాలను ప్రభావితం చేస్తారు. ఎస్సీలకు ఈ నియోజకవర్గం రిజర్వు అయింది.
- 2014, 2019లలో శివసేన గెలిచింది. ఈసారి శిందే సేన నుంచి సిటింగ్ ఎంపీ రాహుల్ శెవాలే, ఉద్ధవ్ సేన నుంచి అనిల్ దేశాయ్ పోటీ చేస్తున్నారు. శెవాలే సిటింగ్ ఎంపీకాగా.. దేశాయ్ రాజ్యసభ సభ్యుడు. ఉద్ధవ్, శిందే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీట్లలో ఇది ఒకటి.
డంప్యార్డుల కష్టం
- ఈశాన్య ముంబయి నియోజకవర్గంలో ఉన్న రెండు డంపింగ్ యార్డుల సమస్య ఈ ఎన్నికల్లో కీలక అంశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ 46శాతం మరాఠీ ప్రజలు ఉంటారు. 17శాతం ముస్లింలు ఉన్నారు. గుజరాతీలూ అధికంగానే ఉంటారు. కాలుష్యం ఇక్కడ అతి పెద్ద సమస్య.
- 2019లో ఇక్కడి నుంచి భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా నుంచి మిహిర్ చంద్రకాంత్ కొటెఖా, ఉద్ధవ్ వర్గం నుంచి సంజయ్ దినా పాటిల్ పోటీ చేస్తున్నారు. భాజపా, శివసేన విడిపోయిన నేపథ్యంలో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.
సర్వమత సమ్మేళనం
- అన్ని మతాలకు చెందిన ఓటర్లు, మురికవాడల ప్రజలు అధికంగా ఉండే ఉత్తర మధ్య ముంబయి ఏ ఒక్కరికీ అడ్డా కాదు. విజేతలు మారుతూ వస్తున్నారు. ఇక్కడ ముస్లింలు, మరాఠీ ఓటర్లు అధికంగా ఉంటారు. సల్మాన్, షారూఖ్, తెందుల్కర్ వంటి ప్రముఖులు ఇక్కడి ఓటర్లు.
- 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్, భాజపా నుంచి న్యాయవాది ఉజ్వల్ నికం పోటీ చేస్తున్నారు. వర్షా 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రముఖ దళిత నేత. వివిధ వర్గాల ప్రజలున్న కారణంగా ఇక్కడ కాంగ్రెస్కు కొంత అనుకూల వాతావరణం ఉంది. భాజపాకు ఎమ్మెల్యేల బలం ఉంది.
గేట్ వే ఆఫ్ ఇండియా
- గేట్ వే ఆఫ్ ఇండియా, స్టాక్ మార్కెట్ ఉన్న ప్రాంతాలు దక్షిణ ముంబయి నియోజకవర్గంలోకి వస్తాయి. హిందువులు అధికంగా ఉన్న కల్బాదేవి, భులేశ్వర్తోపాటు ముస్లింలు అధికంగా ఉండే భిండీ బజార్, మసీదు బండర్ ఇక్కడే ఉన్నాయి.
- 2014, 2019లలో ఇక్కడి నుంచి శివసేన విజయం సాధించింది. ఈసారి ఉద్ధవ్ సేన నుంచి సిటింగ్ ఎంపీ అరవింద్ సావంత్, శిందే సేన నుంచి యామిని జాదవ్ తలపడుతున్నారు. కాంగ్రెస్ మద్దతు కారణంగా సావంత్ గెలుపుపై ఆశగా ఉన్నారు. భాజపా, ఎంఎన్ఎస్ల మద్దతుపై యామిని ఆధారపడుతున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం