Assembly Election Results: ఈ ఫలితాలు హస్తం పార్టీకి లాభమా.. నష్టమా..?
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పక్కాగా గెలుస్తామనుకున్న రెండు రాష్ట్రాల్లో కూడా ఒకటి కోల్పోయింది. మొత్తంగా చూస్తే తెలంగాణలో తొలిసారి అధికారం దక్కించుకోవడమే ఆ పార్టీకి ఊరటగా మిగిలింది. ఇక ఈ ఫలితాలను పార్లమెంట్ ఎన్నికలకు అన్వయించుకొని చూస్తే.. కాంగ్రెస్కు కొంత ఊరట లభించినా.. దిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిని చూస్తే.. కమలం జోరు స్పష్టంగా కనిపించింది. ఒక్క తెలంగాణ మినహా మిగిలిన మూడు కీలక రాష్ట్రాల్లో ఆ పార్టీ గాలే వీచింది. వాస్తవానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2018లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. కానీ, 2020లో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటంతో మధ్యప్రదేశ్లో అధికారం భాజపా హస్తగతమైంది.
వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపాకు కాంగ్రెస్ బలమైన పోటీ ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, సార్వత్రిక ఎన్నికల నాటికి పరిస్థితి ఏకపక్షంగా మారిపోయింది. మోదీ హవాతో ఈ రాష్ట్రాల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ లభించింది. ఛత్తీస్గఢ్లోని మొత్తం 11 లోక్సభ స్థానాల్లో 9 చోట్ల విజయం సాధించింది. ఇక మధ్యప్రదేశ్లో 29 స్థానాలకు గాను 28 చోట్ల.. రాజస్థాన్లోని మొత్తం 25 సీట్లను ఎన్డీఏ దక్కించుకొంది. ఇక బలహీనంగా ఉన్న తెలంగాణలో కూడా భాజపా ఆ ఎన్నికల్లో 4 స్థానాలను సాధించడం విశేషం.
సెమీ ఫైనల్స్లో వికసించిన కమలం..
ఇప్పుడు తాజాగా వెలువడిన అసెంబ్లీ ఫలితాలు హస్తం పార్టీలో గుబులు రేపుతున్నాయి. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భాజపా గణనీయంగా పుంజుకుంది.
- మధ్యప్రదేశ్లో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి 54 అసెంబ్లీ స్థానాలు కాషాయం పార్టీకి అధికంగా లభించాయి. ఇక్కడ హస్తం పార్టీ 48 సీట్లను కోల్పోయింది.
- రాజస్థాన్లో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయమే పునరావృతమైంది. ఈ సారి భాజపాకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. 2018తో పోలిస్తే ఇక్కడ భాజపా సీట్ల సంఖ్య 42కు పెరిగింది. ఆ మేరకు కాంగ్రెస్ 30సీట్లకు కోతపడింది. ఇక్కడ బీఎస్పీ, ఇతరుల సీట్లను కూడా కమలం పార్టీ లాక్కొంది.
- ఇక ఛత్తీస్గఢ్లో భాజపా ఊహించని స్థాయిలో పుంజుకుంది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పాలనపై సర్వేల్లో పెద్దగా వ్యతిరేకత లేదని భావించినా.. ఓటర్లు మాత్రం కమలం పార్టీకి అంచనాలకు మించి గతంలో కంటే 39 స్థానాలు అధికంగా ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కోల్పోయింది.
- ఇక తెలంగాణలో కాంగ్రెస్ హవా ఉన్నా.. భాజపా కూడా బాగానే పుంజుకొంది. 2018 ఎన్నికల తర్వాత పార్టీ క్రమం తప్పకుండా బలపడుతూ వస్తోంది. 2018లో గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే కమలం ఎమ్మెల్యేగా ఉండగా.. ఆ తర్వాత దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ సారి ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించింది.
హస్తంలో లోక్సభ టెన్షన్.. తెలంగాణపైనే ఆశలు..!
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు వచ్చిందన్న సంతోషం కంటే.. మూడు కీలక రాష్ట్రాల్లో దెబ్బతిన్నామన్న విషయం హస్తం నేతలను భయపెడుతోంది. తెలంగాణ మినహా ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 65 లోక్సభ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 62 సీట్లలో ఎన్డీఏ పక్షం విజయం సాధించింది. కానీ, 2024 ఎన్నికల్లో ఇండియా కూటమి నుంచి ఎన్డీఏకు బలమైన పోటీ ఉంటుందని అంచనాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం హవా ఉన్న సమయంలోనే లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ ఇక్కడ దాదాపు క్లీన్స్వీప్ చేసింది. ఈ సారి ఏకంగా అసెంబ్లీలలో కూడా భాజపానే పాగా వేయడంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి మరింత శ్రమించాల్సిన అవసరం ఉంటుంది.
ఇక తెలంగాణలో కూడా భాజపా అసెంబ్లీ స్థానాలు పుంజుకున్నా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక్కడి లోక్సభ స్థానాలు హస్తం పార్టీలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కేవలం 3 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్.. 2024లో పుంజుకొని మరికొన్నింటిని తన ఖాతాలో వేసుకొంటే మాత్రం మొత్తం మీద లాభపడినట్లవుతుంది.
నాలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 82 లోక్సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో వీటిల్లో కేవలం 6 చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. వాటిల్లో మూడు తెలంగాణలోనే ఉన్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో గత పరిస్థితే పునరావృతమైనా.. తెలంగాణలో సీట్లు పెరిగితే మాత్రం హస్తం పార్టీకి లబ్ధి చేకూరినట్లే. కానీ ఇది ఎన్డీఏ నుంచి అధికారం చేజిక్కించుకునే స్థాయిలో మాత్రం ఉపయోగపడకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే