Odisha: గెలుపు తీరం చేరేదెవరు?
ఒడిశాలోని తీర ప్రాంత నియోజకవర్గాల్లో బిజూ జనతాదళ్ (బిజద), భాజపాల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ బరిలో ఉన్నా గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది.
బిజద, భాజపా హోరాహోరీ
ఒడిశాలో 6 స్థానాలకు నేడే పోలింగ్
భువనేశ్వర్, న్యూస్టుడే: ఒడిశాలోని తీర ప్రాంత నియోజకవర్గాల్లో బిజూ జనతాదళ్ (బిజద), భాజపాల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ బరిలో ఉన్నా గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. ఒడిశాలోని భువనేశ్వర్, పూరీ, కటక్, ఢెంకనాల్, సంబల్పుర్, కేంఝర్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ సెగ్మెంట్లలో శనివారం పోలింగ్ జరగనుంది. ఈ విడతలో ఉద్ధండులు బరిలో ఉన్నారు. ఈ 6 లోక్సభ స్థానాల్లో 64 మంది బరిలో ఉన్నారు.
జగన్నాథుడి కొలువు
జగన్నాథుడి కొలువైన పూరీ నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతం ఆర్థికంగా బలంగా కనిపిస్తుంది. ఈ నియోజకవర్గంలో 15.5% ఎస్సీలున్నారు. 83శాతం గ్రామాల్లో నివసిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద వంట గది ఇక్కడ ఉంది. ఎకరా విస్తీర్ణంలో ఉండే 752 స్టవ్లతో మహా ప్రసాదాన్ని తయారు చేస్తారు.
2014, 2019లలో బిజద విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా గెలవాలని ఆశిస్తున్న భాజపా సంబిత్ పాత్రను మరోసారి బరిలో దింపింది. పురీ వాసి అయిన ఆయన ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ముంబయి పోలీస్ కమిషనరుగా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అరూప్ పట్నాయక్ బిజద నుంచి పోటీ చేస్తున్నారు. సంబిత్, అరూప్ల మధ్య పోటీ నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జయ నారాయణ పట్నాయక్ పోటీ నామమాత్రమే.
ఆలయాల నగరి
ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్లో 700 ఆలయాలున్నాయి. అందుకే దీనిని టెంపుల్ సిటీగా పిలుస్తారు. అంతే కాదు.. ఇది విద్యా కేంద్రంగా సాఫ్ట్వేర్ హబ్గా ఉంది. ఈ నియోజకవర్గంలో సగం జనాభా పట్టణ ప్రాంతంలోనే ఉంటారు. ఎస్సీలు 13% ఉన్నారు.
2014లో బిజద, 2019లో భాజపా విజయం సాధించాయి. గత ఎన్నికల్లో గెలిచిన మాజీ ఐఏఎస్ అధికారిణి అపరాజిత సారంగీ మరోసారి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. ప్రైవేటు విమాన సంస్థలో పైలట్గా విధులు నిర్వహించి ఇటీవల ఉద్యోగం వదులుకుని రాజకీయ రంగ ప్రవేశం చేసిన మన్మధ్ రౌత్రాయిని బిజద నిలబెట్టింది. మైనారిటీ కార్డు ప్రయోగించిన కాంగ్రెస్ యాసిర్ నవాజ్ను బరిలోకి దింపింది. పోటీలో ముగ్గురున్నా ప్రధాన పోటీ అపరాజిత, మన్మధ్ల మధ్యే ఉంది.
పురాతన నగరం
క్రీస్తు శకం 941వ సంవత్సరంలో కటక్ ఏర్పాటైందని చరిత్ర చెబుతోంది. మహానది ప్రాంతంలో ఈ నగరం ఉంది. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్ర బోస్ కటక్లోనే జన్మించారు.
1998, 1999, 2004, 2009, 2014, 2019లలో దిగ్గజ నేత భర్తృహరి మెహతాబ్ ఈ నియోజకవర్గం నుంచి బిజద తరఫున గెలిచారు. అయితే ఇటీవలే ఆయన భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున బరిలో నిలిచారు. పారిశ్రామిక రంగంలో కీలక బాధ్యతల్లో 3 దశాబ్దాలపాటు విధులు నిర్వహించిన సంతృప్త మిశ్ర బిజద తరఫున పోటీ చేస్తున్నారు. ఒడిశా నుంచి వెలువడుతున్న ప్రముఖ ఒడియా దినపత్రిక ప్రజాతంత్రకు భర్తృహరి ప్రధాన సంపాదకుడు. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న సురేష్ మహాపాత్ర పోటీ నామమాత్రం.
చీరలకు ప్రసిద్ధి
సంబల్పురీ చీరలకు సంబల్పుర్ ప్రసిద్ధి. గతంలో ఇక్కడి నుంచి వజ్రాలను ఎగుమతి చేసేవారు. అతి పొడవైన హీరాకుండ్ డ్యాం ఇక్కడే ఉంది. 1998 నుంచీ ఇది బిజదకు కంచుకోట. 81% ప్రజలు గ్రామాల్లోనే ఉంటారు. 30% ఎస్టీలు, 17.9% ఎస్సీలున్నారు.
2014లో బిజద, 2019లో భాజపా గెలిచాయి. ఈసారి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బరిలోకి దిగారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విధేయ గణంలో అగ్ర గణ్యుడు, బిజద పార్టీ సిద్ధాంతకర్త ప్రణవ ప్రకాష్దాస్ (బొబి) ధర్మేంద్రకు సవాల్ విసురుతున్నారు. బొబి విజయం కోసం పలువురు బిజద నేతలు సంబల్పూర్లో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ధర్మేంద్ర విజయం కోసం కేంద్ర మంత్రులు, భాజపా శ్రేణులు కృషి చేస్తున్నాయి.
వెనుకబడిన ప్రాంతం
84 శాతం ప్రజలు గ్రామాల్లో ఉండే ఢెంకనాల్ అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఎస్టీలు 13.6%, ఎస్సీలు 19.2% ఉంటారు. గిరిజనులు, పేదలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు వీలుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ను ఢెంకనాల్లో కేంద్రం ఏర్పాటు చేసింది.
2014, 2019లలో బిజద విజయం సాధించింది. ఎమర్జెన్సీ సమయంలో కారాగారంలో ఉన్న భాజపా నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు రుద్ర నారాయణ పాణి 2019 ఎన్నికల్లో ఢెంకనాల్ నుంచి భాజపా తరఫున పోటీ చేసి స్వల్ప తేడాలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయనే బరిలోకి దిగారు. బిజద నుంచి అవినాష్ సామల్ అనే యువకుడు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు సస్మిత్ బెహరా రంగంలోకి దిగారు. రాజకీయ అనుభవం, వ్యూహరచనల్లో దిట్టగా పేరున్న రుద్ర నారాయణ పాణిపై బిజద, కాంగ్రెస్ల నుంచి అంతగా రాజకీయ అనుభవం లేనివారు పోటీ చేస్తున్నారు.
గిరిజనుల ప్రాబల్యం
దాదాపు సగం మంది గిరిజనులుండే కేంఝర్లో 87శాతం గ్రామాల్లో నివసిస్తారు. 10.8శాతం ఎస్సీలున్న ఈ నియోజకవర్గంలో బిజదదే ఆధిపత్యం. ఇక్కడ ఖనిజాలు అపారం. అయినా అభివృద్ధి, మౌలిక సౌకర్యాల్లో తీసికట్టుగానే ఉంది.
2014, 2019లలో బిజద గెలిచింది. ఈసారి ఆ పార్టీ నుంచి నవీన్ ధనుర్జయ సిద్ధు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన అనంత నాయక్ను భాజపా మళ్లీ అభ్యర్థిగా చేసింది. కాంగ్రెస్ బినోధ్ బిహారీ నాయక్ను నిలబెట్టింది. ధనుర్జయ, అనంతల మధ్యే ముఖాముఖి పోరు కనిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తేలనున్న మంత్రుల జాతకాలు
ఈ విడతలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు రాణేంద్ర ప్రతాప్ స్వయిన్, ప్రఫుల్ల మల్లిక్, అశోక్చంద్ర పండా, తుషార కాంతి బెహరా, విపక్ష నేత జయనారాయణ మిశ్ర, బిజద ఉపాధ్యక్షులు దేవీప్రసాద్ మిశ్ర, ప్రసన్న ఆచార్యల భవితవ్యం తేలనుంది. మరోవైపు 5 సార్లు రాష్ట్రాన్ని పాలించిన నవీన్పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి పాలనా పగ్గాలు తమ సొంతం అవుతాయని అంటున్న భాజపా అగ్ర నేతలంతా ఒడిశాలో ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అస్సాం ముఖ్యమంత్రులు రాష్ట్రానికి వరుస కడుతున్నారు. వయోభారంవల్ల నవీన్ మునుపటి మాదిరి ప్రచారం చేయలేకపోతున్నారు. ఆయన ప్రతినిధిగా వి.కార్తికేయ పాండ్యన్ పాల్గొంటున్నారు.
ఎక్కడ ఎంత మంది పోటీ?
- పూరీ: 7
- భువనేశ్వర్: 12
- కటక్: 10
- సంబల్పుర్: 14
- ఢెంకనాల్: 10
- కేంఝర్: 11
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి