LS Polls 6th Phase: ఆరోవిడతలో 61.11%.. 58 స్థానాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక దశ ప్రశాంతంగా ముగిసింది. ఆరో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఓటింగ్ పూర్తయింది. మొత్తంగా వీటిలో 61.11% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక దశ ప్రశాంతంగా ముగిసింది. ఆరో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఓటింగ్ పూర్తయింది. మొత్తంగా వీటిలో 61.11% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 79.40%, అత్యల్పంగా ఉత్తర్ ప్రదేశ్లో 54.03% పోలింగ్ నమోదైంది. అయితే ఇవి తాత్కాలిక గణాంకాలేనని, పూర్తిస్థాయి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ విడతతో 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. చివరిదైన ఏడో దశలో భాగంగా 57 నియోజకవర్గాల్లో వచ్చే నెల 1న ఓటింగ్ జరగనుంది. దిల్లీ, హరియాణాల్లోని అన్ని స్థానాలకు శనివారమే పోలింగ్ పూర్తయింది. దిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తాయి.
ఈవీఎం మొరాయింపుపై బృందా కారాట్ ఆగ్రహం
న్యూదిల్లీ స్థానం పరిధిలోని సెయింట్ కొలంబియా పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ ఓటు వేశారు. అయితే తాను వచ్చేసరికి అక్కడ ఈవీఎం కంట్రోల్ యూనిట్ బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోయిందని, ఫలితంగా దాదాపు 50 నిమిషాలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలకే ఛార్జింగ్ అయిపోవడం.. ఈసీ ఏర్పాట్లు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పేందుకు నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ కేంద్రంలో కేవలం 15 నిమిషాలపాటే ఈవీఎం మొరాయించిందని ఈసీ తెలిపింది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారాట్, సీపీఐ నేత అన్నీ రాజా తదితరులు దిల్లీలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
బెంగాల్లో ఘర్షణలు
బెంగాల్లో జంగల్ మహల్ ప్రాంతంలోని 8 సీట్లకు ఈ దశలో ఓటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భాజపా, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులు, ఫిర్యాదులు చేసుకున్నారు. కేంద్ర బలగాలు తమ మద్దతుదారులపై దాడి చేశాయని కాంథీ లోక్సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి సౌమేందు అధికారి ఆరోపించారు. ఆ స్థానం పరిధిలో కమలదళం కార్యకర్తలు నిరసనలకు దిగారు. మిడ్నాపోర్లో భాజపా అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ను ‘గో బ్యాక్’ అంటూ తృణమూల్ కార్యకర్తలు ఘెరావ్ చేశారు. ఫలితంగా భాజపా, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. భద్రతా బలగాలు వారిని చెదరగొట్టాయి. పశ్చిమ మిడ్నాపోర్ జిల్లాలోని గార్బెటా ప్రాంతంలో తృణమూల్ కార్యకర్తలు తన వాహనశ్రేణిపై ఇటుకలతో దాడి చేశారని ఝార్గ్రామ్ భాజపా అభ్యర్థి ప్రణత్ టుడూ ఆరోపించారు. ఈ ఘటనలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారని పేర్కొన్నారు. ఝార్ఖండ్లోని ధన్బాద్ జిల్లా టుండీలో ఈ దఫా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అక్కడ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వకపోవడం ఇదే తొలిసారి.
జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్-రాజౌరీ జిల్లాలో గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూలేనంత ఎక్కువగా ఓటింగ్ నమోదైందని ఈసీ తెలిపింది. తమ పార్టీ కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, అనంతనాగ్-రాజౌరీ అభ్యర్థి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. అనంతనాగ్ జిల్లా బిజ్బెహరా పోలీసు స్టేషన్ వెలుపల శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఆమె బైఠాయించి ధర్నా నిర్వహించారు.
తరలివచ్చిన ప్రముఖులు
ఆరో విడతలో భాగంగా న్యూదిల్లీ నియోజకవర్గం పరిధిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ సముదాయంలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో.. పూర్తిగా మహిళా సిబ్బందితో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో వరుసలో వచ్చి ఆమె ఓటు వేశారు. దిల్లీ నార్త్ ఎవెన్యూలోని సీపీడబ్ల్యూడీ సేవా కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన పోలింగ్స్టేషన్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమవంతు వచ్చేదాకా వారిద్దరూ వరుసలో నిలబడి వేచిచూశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్, ఆయన సతీమణి కల్పనాదాస్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ తదితర ప్రముఖులు కూడా దిల్లీలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. దిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ చాందినీచౌక్ పరిధిలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో సహా ఓటు వేశారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రా తన భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రేహాన్, కుమార్తె మిరాయాలతో కలిసి వచ్చి.. న్యూదిల్లీ నియోజకవర్గం పరిధిలో లోధీ రోడ్డులోని ఓ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఒడిశాలో పోలింగ్ ప్రశాంతం
భువనేశ్వర్, న్యూస్టుడే: చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే శనివారం ఒడిశాలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పూరీ, భువనేశ్వర్, కటక్, ఢెంకనాల్, సంబల్పూర్, కేంఝర్ లోక్సభ స్థానాలతోపాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల అయిదేళ్ల రాజకీయ భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్ విమానాశ్రయానికి సమీపంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. హిందోళ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 136వ పోలింగ్ బూత్ ఏజెంటు శుకదేవ్ పట్నాయక్ (35) స్పృహతప్పి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన మృతిచెందాడు. ఖండపడ నియోజకవర్గంలోని 167వ నెంబరు పోలింగ్ కేంద్రంలో ఓటేయడానికి వచ్చిన 60 ఏళ్ల వృద్ధురాలు స్పృహతప్పి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు