AAP: ఏంటీ అరాచకం.. పార్టీ కేంద్ర కార్యాలయానికి తాళం వేస్తారా?: ఆప్ నేతలు
దిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయాన్ని కేంద్రం అక్రమంగా మూసివేయించిందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి ఆతిశీ వెల్లడించారు.
దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టయినప్పటి నుంచి దేశ రాజధానిలో రాజకీయ వేడి రాజుకుంటోంది. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా.. పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మూసి వేయించిందని ఆప్ నేతలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓ జాతీయ పార్టీ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆప్ మంత్రి ఆతిశీ (Atishi) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం అరాచకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
కేంద్రం వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగం నిర్దేశించిన హద్దులు దాటి ప్రవర్తించడమేనని ఆతిశీ మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు అనుమతి కోరామని, నేరుగా వెళ్లి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఐటీవోలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లేందుకు అన్ని మార్గాలను కేంద్ర ప్రభుత్వం మూసివేయించిందని మరో ఆప్ మంత్రి సౌరవ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలా వ్యవహరించడం నిరంకుశత్వమేనని దుయ్యబట్టారు.
దీన్దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లోని ఐటీఓ సమీపంలోని ఆప్ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు శుక్రవారం మూసివేశారు. ఇక్కడికి సమీపంలోనే భాజపా కార్యాలయం ఉంది. కేజ్రీవాల్ అరెస్టుపై నిరసన తెలిపేందుకు ఆప్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM