Kejriwal: కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా సామూహిక నిరాహార దీక్షలు
Kejriwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఆదివారం సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తోంది.
దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆదివారం సామూహిక నిరాహార దీక్షలు చేపట్టింది. దిల్లీలోని జంతర్మంతర్ దీనికి వేదికైంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అమెరికా బోస్టన్లోని హార్వర్డ్ స్క్వేర్, లాస్ ఏంజిల్స్లోని హాలీవుడ్ సైన్, వాషింగ్టన్లో భారత రాయబార కార్యాలయం వెలుపల, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్, టొరంటో, లండన్, మెల్బోర్న్లోనూ తమ మద్దతుదారులు దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నాయి.
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దీక్షకు కూర్చుకున్నట్లు ఆప్ (AAP) తెలిపింది. దిల్లీలో దీక్ష చేపట్టినవారిలో అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్, డిప్యూటీ స్పీకర్ రాఖీ బిలా, మంత్రులు ఆతిశీ, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ ఉన్నట్లు వెల్లడించింది. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆప్ దిల్లీ శాఖ అధ్యక్షుడు గోపాల్ రాయ్ పిలుపునిచ్చారు. దిల్లీ ఎక్సైజ్ విధానానికి సంబంధించిన కేసులో సీఎంను ఇరికించడం భాజపా కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 15 వరకు కేజ్రీవాల్ (Arvind Kejriwal) జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?