Congress: గహ్లోత్ నోట ఆ మాటలు అస్సలు ఊహించలేదు: కాంగ్రెస్
మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్పై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ స్పందించింది.
దిల్లీ: సచిన్ పైలట్ ద్రోహి, సీఎం పదవికి అనర్హుడంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. సీఎం పీఠం కోసం పైలట్, గహ్లోత్ మధ్య కొన్నేళ్లుగా పేచీ నడుస్తోంది. ఈ విమర్శలతో వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
‘ఇంటర్వ్యూలో గహ్లోత్ వాడిన తీవ్రపదజాలం అస్సలు ఊహించలేదు. మేమంతా ఒక కుటుంబం. మాకు పైలట్, గహ్లోత్ ఇద్దరూ కావాలి. ఆ అభిప్రాయభేదాలు సమసిపోతాయి. కానీ ఆయన వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యపర్చాయి. విషయం ఏదైనా.. ఇక్కడ వ్యక్తుల కంటే సంస్థే ఉన్నతమైంది’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పష్టం చేశారు.
మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్పై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్ పైలట్ను విశ్వాస ఘాతకుడిగా అభివర్ణించిన గహ్లోత్.. అలాంటి వ్యక్తితో సీఎం స్థానాన్ని భర్తీ చేయలేరని వ్యాఖ్యానించారు. 2020లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సొంత ప్రభుత్వాన్నే పడగొట్టేందుకు ప్రయత్నించారంటూ మండిపడ్డారు. మరోపక్క మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న సచిన్ పైలట్.. అశోక్ గహ్లోత్ వ్యాఖ్యలపై స్పందించారు. తనలాంటి సీనియర్ నేతపై అలాంటి భాషను వాడటం సరికాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..