Devendra Fadnavis: ఫడణవీస్..మీరు రాజీనామా చేయొద్దు: అమిత్ షా!
మహారాష్ట్రలో భాజపా పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ రాజీనామాకు సిద్ధమైన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ను పార్టీ అధిష్ఠానం బుజ్జగించింది. పదవిలో కొనసాగాల్సిందిగా కోరింది.
దిల్లీ: మహారాష్ట్రలో (Maharashtra) భాజపా (BJP) పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ రాజీనామాకు సిద్ధమైన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ను ఆ పార్టీ అధిష్ఠానం బుజ్జగించింది. పదవిలో కొనసాగాల్సిందిగా కోరింది. ఈ మేరకు అమిత్ షా ఆయనకు చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల్లో ఫడణవీస్ నేతృత్వంలోని భాజపా.. శివసేన (ఏక్నాథ్ శిందే), ఎన్సీపీ (అజిత్ పవార్)తో కలిసి బరిలో దిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి శివసేనతో కలిసి పోటీ చేసిన భాజపా 48 స్థానాలకు గానూ 41 చోట్ల విజయం సాధించింది. కానీ, తాజాగా మహాయుతి కూటమి కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ఠాక్రే), ఎన్సీపీ(శరద్పవార్)లతో కలిసి ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ 30 స్థానాలను కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో పార్టీ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ తాను డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఫలితాలు వెలువడిన తర్వాతి రోజునే ఫడణవీస్ భావించారు. తన నిర్ణయాన్ని అగ్రనేత అమిత్ షాకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో అమిత్షా మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి పని తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫడణవీస్ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అమిత్షా నివాసంలో ఫడణవీస్ ఆయన్ను కలిసి మాట్లాడారు.
ఫలితాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిప్యూటీ సీఎంగా కొనసాగాలని సూచించినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబరులో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. భాజపా పుంజుకునేందుకు అవసరమైన చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభించాలని అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ‘‘ ఇప్పుడు మీరు రాజీనామా చేస్తే.. దాని ప్రభావం పార్టీ కార్యకర్తలపై తీవ్రంగా పడుతుంది. అందుకే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి’’ అని అమిత్షా హితవు పలికినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?