YS Jagan - Pinnelli: ‘మా పిన్నెల్లి మంచివాడు’ అంటూ కితాబిచ్చారే.. జగన్ ఇప్పుడేమంటారో?
‘పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడు’ అంటూ ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ పొగిడేశారు. ఇప్పుడు ఆయన ఏమంటారో?
ఇంటర్నెట్ డెస్క్: ‘‘మాచర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) నాకు మంచి స్నేహితుడు, మంచివాడు. మీ అందరికీ ఒక మాట చెబుతున్నా.. రామకృష్ణా రెడ్డిని అఖండమైన మెజారిటితో గెలిపించండి. ఇంకా పై స్థానంలోకి తీసుకెళతాను’’ అని మే నెల 6న మాచర్ల (Macharla)లో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలో అరాచకానికి, దౌర్జన్యానికి దిగిన వీడియోలు బయటకు రావడం, అరెస్టు చేయండి అంటూ ఎన్నికల సంఘం ఆదేశించడంతో.. ‘ఎంతో మంచివాడంటే.. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి అక్కడి వారందరినీ భయభ్రాంతులకు గురి చేసి, ఈవీఎంలు ధ్వంసం చేసేవారా?’ అని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. ‘‘రామకృష్ణారెడ్డి మీకు మరింత స్నేహితుడు అంటున్నారు. అలాంటి వ్యక్తులే మీ స్నేహితులా? ఈవీఎం పగలగొట్టిన ఆయనపై చర్యలు తీసుకుంటారా? లేదా మరింత పై స్థానం కల్పిస్తానంటూ వెనకేసుకొస్తారా’’ అని ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్డీయే మైనార్టీ సర్కార్... అయితే కొనసాగాలి: ఖర్గే కీలక వ్యాఖ్యలు
Mallikarjun Kharge: కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఆ సర్కారుకు మెజార్టీ లేదన్నారు. -
మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు: కమిషన్కు కేసీఆర్ లేఖ
విద్యుత్ కొనుగోలు విషయంలో భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు వివరణ ఇచ్చారు. -
పుంగనూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారనే సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. -
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది: హోంమంత్రి అనిత
వైకాపా ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. -
భారీ మెజార్టీతో నాపై బాధ్యత మరింత పెరిగింది: ‘ప్రజా దర్బార్’లో లోకేశ్
మంగళగిరి ప్రజల కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశామన్నారు. -
క్యాబినెట్లో యువతకు ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నాం: యనమల రామకృష్ణుడు
‘‘రాష్ట్ర మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో 50% కంటే ఎక్కువమంది యువతకు మంత్రి పదవులు ఇచ్చారు’’ అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. -
నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డగించారు.. నేడు ప్రొటోకాల్తో లోపలికి..
‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి వినతిపత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేటు లోపలకు కూడా అనుమతించకుండా రోడ్డుపైనే అడ్డగించారు. హెడ్కానిస్టేబుల్కు ఇచ్చి వెళ్లిపోవాలంటూ జులుం చూపారు. ఇదే డీజీపీ కార్యాలయం లోపలకు ప్రొటోకాల్తో నన్ను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే వారికి చెప్పా. -
ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తా
రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని రాష్ట్ర ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. స్టాన్ఫర్డ్లో చదువుకొన్న తనకు గ్రామీణ విద్యావ్యవస్థను బలోపేతం చేసే అవకాశం రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
సంపన్న రాష్ట్రంగా చేద్దాం
‘మంత్రివర్గంలో మీతోపాటు సహచర మంత్రులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వంలో సమాజంలోని అన్ని వర్గాల పురోగతి, శ్రేయస్సు, సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి సమష్టిగా కృషి చేద్దాం. -
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును నియమించే అవకాశముంది. ఆయన ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. -
గృహ నిర్మాణాల పూర్తికి కృషి చేస్తాం: మంత్రి పార్థసారథి వెల్లడి
అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలో శాఖాపరమైన బాధ్యతలను శుక్రవారం రాత్రి స్వీకరించారు. -
జగన్పై చర్యలు తప్పవు: గోరంట్ల
వైకాపా అయిదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. -
పెద్దిరెడ్డి పాపాల నిగ్గు తేల్చాలి
అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత ఐదేళ్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక అక్రమాలు.. అరాచకాలకు పాల్పడ్డారని బీసీవై పార్టీ అధ్యక్షుడు బి.రామచంద్రయాదవ్ ఆరోపించారు. -
పార్లమెంటులో ఎవరికైనా అంశాల వారీగా మద్దతు
‘పార్లమెంటులో ఎన్డీయే అయినా, ఇంకెవరికైనా అంశాలవారీగానే మన మద్దతు ఉంటుంది. పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి’ అని వైకాపా ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ స్పష్టం చేశారు. ‘రాజ్యసభలో 11, లోక్సభలో 4 మొత్తంగా పార్లమెంటులో మనకు 15మంది ఎంపీలున్నారు. -
శాసనమండలి వద్దన్న వారికే.. నేడు ఆ వ్యవస్థతో అవసరం వచ్చింది
శాసనమండలి వద్దన్న వారికే నేడు ఆ వ్యవస్థతో అవసరం ఏర్పడిందని.. జగన్ను ఉద్దేశించి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం మండలి సభ్యులతోనే వారు సమావేశాలు నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి: వర్ల రామయ్య
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే సవిత మంత్రి పదవి దక్కించుకోవడం హర్షణీయమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. -
రెండో రోజూ సచివాలయంలో సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు వరుసగా రెండో రోజూ సచివాలయానికి రావడంతో సందడి నెలకొంది. ఆయన్ను కలిసేందుకు నేతలు, సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎంగా గురువారం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ద్వితీయ విఘ్నం ఉండకూడదని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయానికి వచ్చారు. -
సీనియర్ల సేవల్ని వినియోగించుకుంటాం
మంత్రివర్గంలో చోటు కల్పించలేని సీనియర్ నాయకుల సేవల్ని వేరే రూపంలో వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సీనియర్ నాయకులు కొందరు చంద్రబాబును సచివాలయంలో కలిశారు. -
ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజావిశ్వాసం కోల్పోయిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ఛుగ్ విమర్శించారు. -
దేశవిదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆహ్వానిస్తామని సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తాం
పేద ప్రజలు, రైతాంగానికి చిత్తశుద్ధితో సేవలందించే అవకాశం పౌర సరఫరాల శాఖ ద్వారా తనకు దక్కిందని ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కాలర్ ఐడీ’పై ట్రయల్స్ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు
-
రాష్ట్రం కోసం నీతీశ్ ఏమి చేస్తున్నారు: ప్రశాంత్ కిషోర్
-
విఘ్నేశ్తో గొడవపై స్పందించిన విజయ్ సేతుపతి.. ఏమన్నారంటే
-
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ..
-
లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగింపు
-
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్..8మంది నక్సల్స్ మృతి