AP Election Results: బూతులు తిట్టే వారికి.. బూత్లోనే బుద్ధి చెప్పిన ప్రజలు
సమాజంలో గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నామన్న విచక్షణ కోల్పోయి, బూతు పురాణం ప్రవచించిన వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజలు తగు రీతిలో బదులిచ్చారు.
కొడాలి నాని, వంశీ, అనిల్, అంబటికి గుణపాఠం
చంద్రబాబు ఇంటిపై దాడికెళ్లిన జోగి ఇంటికే
తెనాలిలో శివకుమార్ను ఓటుతో కొట్టిన సామాన్యులు
అరాచక శక్తి పిన్నెల్లి పీచమణిచిన మాచర్ల ఓటరు
ఈనాడు, అమరావతి: సమాజంలో గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్నామన్న విచక్షణ కోల్పోయి, బూతు పురాణం ప్రవచించిన వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజలు తగు రీతిలో బదులిచ్చారు. ప్రతిపక్షాలపై బూతులతో విరుచుకుపడ్డ వారికి పోలింగ్ బూత్లలోనే బుద్ధి చెప్పారు. ‘విపక్షాలపై తిట్లు, దాడులతో రెచ్చిపోవాలి. అధినేతను స్తుతించాలి. మా ప్రభుత్వంలో పదవులకు ఇవే ప్రమాణాలు’ అని కొత్త నిర్వచనాలు సూత్రీకరించిన నేతాగణాన్ని ఓటర్లు తిరస్కరించారు.
- మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) మైకు ముందుకొస్తే చాలు, నోటి వెంట తిట్ల దండకమే. ఆ అసభ్య పదజాలం వినలేక చెవులు మూసుకోవాల్సిన దుస్థితి. అసెంబ్లీలోనూ బూతులు మాట్లాడి చివరికి ‘బూతుల మంత్రి’గా బిరుదు సంపాదించుకున్నారు. ఇంటిల్లిపాది వార్తలు చూస్తున్న క్రమంలో కొడాలి నాని వార్త ప్రసారమైందంటే.. ఆ తిట్లు వినలేక టీవీ ఛానల్ మార్చాలి అన్నంత ఘనత సాధించారు. రాజకీయ విమర్శ శ్రుతి మించి, బూతుగా మారితే భరించలేరన్న నిజాన్ని గుడివాడ ప్రజలు నిరూపించారు.
- మంత్రి జోగి రమేశ్ ప్రతిపక్షాలను తిట్టడంలో తోటి మంత్రులతో పోటీ పడ్డారు. నిత్యం నోటి దురుసుతో ప్రవర్తించారు. కృష్ణా జిల్లా పెడన నుంచి ఈసారి పెనమలూరుకు మారి పోటీచేసినా ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. అనుచరులను వెంటేసుకొని, కర్రలు చేతపట్టుకొని ఏకంగా చంద్రబాబు నివాసంపైకి దండయాత్రగా వెళ్లిన జోగి రమేశ్కు.. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. జగన్ సందేశాన్ని అర్థం చేసుకున్న పలువురు ఎమ్మెల్యేలు.. రమేశ్ పంథాను అనుసరించి విపక్షాలపై నిత్యం నోరు పారేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో తిట్లు, దాడులకు స్థానం లేదని పెనమలూరు ఓటర్లు తీర్పిచ్చారు.
- మాజీ మంత్రి అనిల్కుమార్ అసెంబ్లీలోనే ‘బుల్లెట్ దిగిందా? లేదా అనేదే ముఖ్యమ’ంటూ పక్కా ఆకు రౌడీ భాషలో మాట్లాడారు. ప్రతిపక్షాల పట్ల తరచూ దురుసుగా, దుందుడుకుగా ప్రవర్తించారు. ‘దమ్ముంటే చూసుకుందామా’ అంటూ అనిల్ చొక్కా చేతులు మడతపెట్టి బెదిరించిన వీడియోలు సామాన్యులను భయపెట్టాయి. వీరు ప్రజాప్రతినిధులా? రౌడీలా అన్న ప్రశ్నకు జవాబే నరసరావుపేట ప్రజల తీర్పు.
- తెదేపా కార్యాలయంపై దాడులు చేయించడం, శ్రేణులపై పోలీసులతో కేసులు పెట్టించడం, భౌతిక దాడులకు ఉసిగొల్పడం ద్వారా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కన్నతల్లి లాంటి తెదేపాపై కత్తికట్టారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు భార్యపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. గన్నవరం నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదమన్నట్లు నిరంకుశంగా శాసించారు. చివరకు ఓటరు తీర్పు చూసి, గన్నవరం నుంచి పలాయనం చిత్తగించారు.
- తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ కేంద్రం వద్ద సామాన్యుడిపై దాడి చేశారు. వరసలో నిలబడి ఓటు వేయాలని అన్నందుకు ఓటరు సుధాకర్ చెంపపై కొట్టారు. అనుచరులతో దాడి చేయించారు. సామాన్యుడిపై ఎమ్మెల్యే దాష్టీకాన్ని మధ్యాహ్నం టీవీల్లో చూసిన ఓటర్లు.. సాయంత్రం కల్లా ఓటు రూపంలో తీర్పునిచ్చారు.
- మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తానొక ప్రజాప్రతినిధిననే విషయాన్ని విస్మరించి ఏకంగా పోలింగ్ బూత్లోని ఈవీఎంను ధ్వంసం చేశారు. అక్కడే ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా కూర్చున్న తెదేపా వారిపై ఆయుధాలు, కర్రలతో దాడులకు పురికొల్పారు. ఇన్నాళ్లుగా పిన్నెల్లి అరాచకాలకు భరించిన మాచర్ల ఓటర్లు అదనుచూసి గుణపాఠం చెప్పారు.
- గంట, అర గంట అంటూ అసభ్య మాటలతో మహిళా లోకాన్ని కించపరిచిన మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు సామాజిక మాధ్యమాల్లో అభాసుపాలయ్యారు. వీరిద్దరి ఆడియో కాల్స్ మీడియాలో వైరలయ్యాయి. ఇలాంటి వారా.. మన పాలకులు అన్న సామాన్యుడి ధర్మాగ్రహం వారిద్దరికీ ఓటమి రుచి చూపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి